-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఆదోని, మార్చి 23: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంకులో ఎవరూ లేని సమయంలో మంటలు ఎగసిపడడంతో భారీ ఆస్తినష్టం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సెలవు కావడంతో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో కొంతమంది సిబ్బంది మధ్యాహ్నం వరకు పనిచేసి తాళాలు వేసి వెళ్లారు.
న్యూఢిల్లీ, మార్చి 23: అక్రమంగా విదేశీ కరెన్సీని తన వద్ద ఉంచుకున్న అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ. 14.40 లక్షల జరిమానా విధించింది. 17 ఏళ్ల క్రితం అక్రమంగా పది వేల అమెరికన్ డాలర్లను తన వద్ద ఉంచుకున్న గిలానీకి విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన నిరోధక చట్టం కింద ఈ జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 23: విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారి మద్యం సేవించి వాహనం నడిపి ఓ ప్రమాదానికి బాధ్యుడైనందున సస్పెన్షన్కు గురయ్యాడు. పూర్తి వివరాలకు వెళితే పాతబస్తీ కాలపత్తర్ పోలీసు స్టేషన్లో అదనపు ఇన్స్పెక్టర్గా విధులను నిర్వహిస్తున్న బి.విక్రమ్ సింగ్ శనివారం ఉదయం తిరుమలగిరి ట్రాఫిక్ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ చేశాడు.
నేరేడ్మెట్, మార్చి 22: పని చేసే సంస్థకే కన్నం వేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కధనం ప్రకారం మల్కాజిగిరి వినాయకనగర్లో నివసించే ముత్యాల ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరిలోని మ్యాక్స్ బట్టల షోరూంలో క్యాషియర్గా పని చేస్తున్నాడు. ఈనెల 17న సంస్థకు సంబంధించిన నలభై వేల రూపాయలను సంస్థ ప్రతినిధులకు తెలియకుండా దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 22: జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్పై (జేకేఎల్ఎఫ్) నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. జేకేఎల్ఎల్కు యాసిన్మాలిక్ అధ్యక్షుడుగా ఉన్నాడు. రాష్ట్రంలో మిలిటెంట్లకు మద్దతు ఇస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే అభియోగంపై జేకేఎల్ఎఫ్ను కేంద్రం నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉత్తర్వులను జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 22: యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామ శివారు ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేవంలో మాట్లాడుతూ గురువారం రాత్రి సైదాపురం శివారు ప్రాంతంలోని సర్వే నెంబర్ 32లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు
వినుకొండ, మార్చి 22: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి చంపేసి, తరువాత తల్లి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా, కొంత సేపటికే తండ్రి కూడా ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
లింగపాలెం, మార్చి 22: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె గోకవరం పంచాయతీలోని గణపవారిగూడెం, కె గోకవరం గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..కె గోకవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో వీరిద్దరూ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు.
రాజమహేంద్రవరం, మార్చి 22: ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాలు, డ్రగ్స్ వ్యాపారాల తర్వాత అతి పెద్ద అక్రమ వ్యాపార వ్యవస్థగా వన్యప్రాణి సంబంధ నేర సామ్రాజ్యం విస్తరించిందని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సదరన్ రీజియన్ (చెన్నై) డిప్యూటీ డైరెక్టర్ టి ఉమ చెప్పారు. ఏటా 20 బిలియన్ యూ ఎస్ డాలర్ల మేర వన్యప్రాణి వ్యాపారం సాగుతోందని గుర్తించినట్టు చెప్పారు.
న్యూఢిల్లీ, మార్చి 22: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐతో దర్యా ప్తు చేపట్టేల ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం శాఖకు ఆయన కుమార్తె డా. సునీతారెడ్డి విజ్ఞ ప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. అంతకుముందు సునీతారెడ్డి తన తండ్రి హత్యపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.