-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నందిగామ, ఫిబ్రవరి 6: ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత నెల 31న కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఐతవరం వద్ద జయరాం మృతదేహం కారులో లభించిన విషయం తెలిసిందే. బుధవారం హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
చెన్నై, ఫిబ్రవరి 6: వ్యాపార సంస్థలకు ఒక పక్క పెద్దమొత్తంలో భూమిని కేటాయిస్తున్న ప్రభుత్వం మరోపక్క ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారిని వెళ్లగొట్టడంలో ఎందుకు ఉత్సాహం చూపిస్తోందని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైదరాబాద్(ఖైరతాబాద్), ఫిబ్రవరి 6: హైదరాబాద్లో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. పం జాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగా ఝాన్సీ(21) హైద రాబాద్ పంజాగుట్టలోని నాగార్జున నగర్ కాలనీ శ్రీసాయిరామ్ అపార్ట్మెంట్లో నివాసం ఉం టోంది. గతంలో మా టీవీలో ప్రసారమైన పవిత్రబంధం సీరియల్లో నటించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడానికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా అరెస్టు చేసిందుకు ప్రభుత్వం రేవంత్రెడ్డికి రూ. 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఉండి, ఫిబ్రవరి 6: పాన్ మసాలా పేరుతో అనుమతి తీసుకుని గుట్కా, ఖైనీ తదితర నిషేధిత పదార్థాలను రహస్యంగా తయారుచేస్తున్న స్థావరంపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు బుధవారం దాడులుచేశారు. ఈసందర్భంగా రూ.15 లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లు, వాటి తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను సీజ్చేశారు. అలాగే ప్యాకింగ్ తదితరాలు ఉపయోగించే యంత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలావున్నాయి...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: విదేశాల్లో నివసించే భారతీయులకు ఉచితంగా న్యాయసేవలు అందించేలా ఓ విధానం రూపకల్పనకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్ బుధవారం హైకోర్టు ముందుకొచ్చింది.‘ విదేశాల్లో ఒక్కోదేశానికి ఒక్కోరకమైన చట్టం ఉంటుంది.
ఉరవకొండ, ఫిబ్రవరి 6 : పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక కౌలు రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పెద్దముష్టూరు గ్రామాంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు పెద్దముష్టూరుకు చెందిన కౌలు రైతు బోయ రాము(25) రెండు సంవత్సరాల నుంచి నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు.
బొమ్మనహాల్, ఫిబ్రవరి 6 : మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ శేఖర్ (30) మృతి చెందినట్లు ఎస్సై నాగమధు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు శేఖర్ బొమ్మనహాల్ నుంచి సొంత గ్రామం దేవగిరి గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా రెవెన్యూ కార్యాలయం సమీపంలోకి రాగానే ఎదురుగా బొలేరో వచ్చి ఢీకొంది.
వీరఘట్టం, ఫిబ్రవరి 6: మండలంలోని చిట్టిపుడివలస జంక్షన్ వద్ద బుధవారం ఆటోబోల్తాపడిన సంఘటనలో చలివేంద్రి గ్రామానికి చెందిన వారాడ వరహాలమ్మ (58) తీవ్రంగా గాయపడింది. మండల కేంద్రమైన వీరఘట్టం నుంచి పార్వతీపురం వెళుతున్న ఆటో చిట్టిపుడివలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదానికి గురైంది. వెంటనే గాయపడిన వరహాలమ్మను 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు: ఆయనొక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. ట్రాన్స్కోలో సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నెమళ్లపూడి ప్రభాకర్రెడ్డి ఆస్తులు కూడబెట్టడంలో కూడా సీనియర్ అనిపించుకున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరులోని ఆయన ఇంటితో పాటు పలువురు సన్నిహితుల ఇళ్లపై నెల్లూరు ఏసిబి అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు.