S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/04/2019 - 02:37

న్యూఢిల్లీ, జనవరి 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతులుపై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలవరం అనుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్‌తోపాటు ‘రెలా’ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు చెపట్టింది.

01/04/2019 - 02:22

హైదరాబాద్, జనవరి 3: సినీ హీరో ప్రభాస్‌పై ఉన్న భూకబ్జా కేసులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రభాస్‌కు చెందిన స్థలంలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదని తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. ప్రభాస్‌కు చెందిన ఆస్తులపై హైకోర్టులో వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

01/04/2019 - 02:06

న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక పదవి నుంచి తొలిగించడాన్ని సవాల్ చేస్తూ రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అక్రమంగా అర్చక పదవి నుంచి తొలగించారని, తిరిగి తనను విధుల్లోకి తీసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించాలని రమణ దీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

01/04/2019 - 01:36

కొత్తూరు రూరల్, జనవరి 3: ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ మండల పరిధిలోని చలివేంద్రంగూడ గ్రామంలో చోటు చేసుకుంది. నందిగామ ఏఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... చలివేంద్రంగూడ గ్రామానికి చెందిన కేనం విజయ్‌కుమార్ (28) అనే యువకుడుకి గత నాలుగు నెలల క్రితం వివాహామైంది. భార్యభర్తల మధ్య మనస్పర్థాలు చోటు చేసుకోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని వివరించారు.

01/04/2019 - 01:35

శంషాబాద్, జనవరి 3: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆర్‌జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్‌కు చెందిన ప్రవీన్ యాదవ్ (22) గురువారం సాయంత్రం శంషాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్తుండగా కొత్వాల్‌గూడ ఔటర్ రింగ్ వద్ద వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ప్రవీణ్ యాదవ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

01/04/2019 - 01:24

కుషాయిగూడ, జనవరి 3: కాప్రా ప్రశాంత్‌నగర్‌లో గొలుసు దొంగలు విజృంభించారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా చేసుకున్న దొంగలు మహిళ మెడలో నుంచి ఏడు తులాల బంగారు గొలుసు లాక్కువెళ్లిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

01/04/2019 - 00:27

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాబ్రీమసీదు వివాదానికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు శుక్రవారం చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ నిర్వహిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 14 అభ్యర్థనలు దాఖలైనందున ధర్మాసనంలోని జడ్జీల సంఖ్య ముగ్గురుకు చేరవచ్చు.

01/04/2019 - 00:22

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పిన కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో పంచాయతీ ఎన్నికలు యథావిధిగానే జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

01/03/2019 - 23:13

వరదయ్యపాళెం, జనవరి 3: వరదయ్యపాళెం మండలంలోని అయ్యవారిపాళెం గ్రామంలో మట్టిపెళ్లలు పడి చెరివి మునెయ్య (50) అనే రైతు మృతిచెందారు. వివరాల్లోకివెళితే... అయ్యవారిపాళెం గ్రామానికి చెందిన మునెయ్య రోజూలాగే పొలానికి నీరు పెట్టడానికి బుధవారం రాత్రి వెళ్లారు. నీటి మోటార్ పక్కనే నీరు నిల్వ చేసుకోవడానికి గుంత చేస్తుండగా ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు పడి ఊపిరాడక మునెయ్య మృతిచెందారు.

01/03/2019 - 23:13

పీలేరు, జనవరి 3: పీలేరు-చిత్తూరు జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్‌బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా పోరుమామిళ్ల రెడ్డినగర్‌కు చెందిన బాలయ్య తండ్రి బాలయ్యకు అనారోగ్యంగా ఉండటంతో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి వేలూరు సీఎంసీకి కారులో బయలుదేరారు.

Pages