S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇప్పుడు ఏ వుడ్డులో చూసినా బయోపిక్ల జోరు ఓ రేంజ్లో నడుస్తోంది. ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు సెట్స్మీద వుండగానే మరి కొన్ని చిత్రాలు సెట్స్పైకి తెచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సీఎం, ఐరన్ లేడీ జయలలిత బయోపిక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయ. ఇప్పటికే జయలలిత కోసం రెండు సినిమాలు రంగంలో ఉండగా, తాజాగా మరో బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది.
మాస్ హీరో విశాల్తో ఎన్.లింగుస్వామి రూపొందించిన యాక్షన్ ఎంటర్టైన్ పందెంకోడి 2. దసరాకు విడుదలై సెనే్సషనల్ హిట్ సాధించింది. 6 కోట్లకు కొన్న సినిమా ఐదు రోజుల్లో 5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ పందెం కోడి చిత్రం నా కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం. ఈ సినిమా సీక్వెల్ చెయ్యాలనుకున్నపుడు మొదటి సినిమా రేంజ్లో చెయ్యగలమా?
నిర్మాత వరం జయంత్కుమార్ సారథ్యంలో శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను నటించిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. ఎం.రాజేష్ దర్శకుడు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత వరం జయంత్కుమార్ మాట్లాడుతూ ఇటీవలే విడుదల చేసిన డి.ఇమామ్ సంగీతం సమకూర్చిన చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
అర్జున్రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చకున్న రాహుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెళ్లి గురించి రాహులే స్వయంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఫన్నీగా పోస్ట్ చేశాడు. ‘నేను జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నాను. సీరియస్గా చెబుతున్నా.
వరుస పరాజయాలతో కొనసాగుతున్న మాస్ హీరో గోపీచంద్కు ఇటీవల విడుదలైన ‘పంతం’ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా ఈ హీరో తన కొత్త చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విన్నర్, బలుపు చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించడానికి సన్నద్ధమవుతున్నాడట.
హీరోయిన్లుగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రథం. రాజా దారపునేని నిర్మించిన చిత్రం 26న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నిర్మాత రమేష్ పుప్పాల, ఎస్.గోపాల్రెడ్డి, మధు హాజరయ్యారు. రమేష్ పుప్పాల మాట్లాడుతూ హీరో అవుతాడనుకున్న రథం రాజా ప్రొడ్యూసర్ అయ్యాడు. దర్శకుడు చంద్రశేఖర్ కష్టమంతా ట్రైలర్లో కనపడుతోంది.
తనీష్ హీరోగా నగేష్ నారదాసి దర్శకత్వంలో స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) ‘దేశదిమ్మరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తనీష్కు జోడీగా షరీన్ నటిస్తోంది. ఈ చిత్రంతో తనీష్ తనలోని గాయకుడిని మనకు పరిచయం చేస్తున్నాడు. హే పైసా అంటూ డబ్బుపై వచ్చే ఓ సెటైరికల్ సాంగ్ని తనీష్ స్వయంగా పాడాడు. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించిన చిత్రం పాటలు ప్రసాద్ ల్యాబ్స్లో విడుదలయ్యాయి.
బాహుబలి ఇంకా వెంటాడుతున్నాడు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన రాజుల కథను రెండక్షరాల టైటిల్తో మస్తిష్కానికి మళ్లీ గుర్తు చేస్తున్నాడు. -మాహిష్మతి సామ్రాజ్య ప్రజలు ఏ పేరుతో వీరుడిని కీర్తించారో ఆ పేరే ప్రభాస్ తరువాతి ప్రాజెక్టు టైటిల్ అన్నది తెలిసిందే. అదే -సాహో. బాహుబలి హిట్టు సాంగ్ కోరస్లోని తొలి అక్షరాలివి.
గోవా భామ ఇలియానా ఎప్పుడైతే బాలీవుడ్ని నమ్ముకొని తెలుగు సినిమాలు మానేసిందో అప్పటినుండి ఆమెకు బ్యాడ్టైమ్ మొదలైంది. హిందీలో కేవలం రెండు మూడు చిత్రాలే చేసింది. అవీ గోవా బ్యూటీకి గొప్పగా కలిసి రాలేదు. సినిమాలు తగ్గడంతో మళ్లీ క్రేజ్ పెంచుకునే దిశగా హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది.
అక్కినేని నాగార్జున లేటెస్ట్గా నానితో కలిసి దేవదాస్ అనే మల్టీస్టారర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలమధ్య విడుదలైన దేవదాస్ యావరేజ్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తరువాత తమిళ్ హీరో ధనుష్తో కలిసి మరో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు నాగ్. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఖరారుచేసారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాన్ రుద్రన్ అనే టైటిల్ ఓకే చేసారు.