S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/24/2017 - 23:29

చైనా-ఇండియా యుద్ధ నేపథ్యంతో రూపొందించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమాకు విమర్శకులు, సమీక్షకులు ఇచ్చిన రేటింగ్‌పై సల్మాన్ పరోక్ష విమర్శలు చేశారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో నిర్మించిన ట్యూబ్‌లైట్ ఈనెల 23న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రతి రంజాన్ సందర్భంగా సల్మాన్ సినిమా రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. ఈసారి ట్యూబ్‌లైట్‌తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

06/24/2017 - 23:28

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన డిజె - దువ్వాడ జగన్నాథమ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చిత్ర కథానాయిక పూ జా హెగ్డే చిత్ర విశేషాలను వివరించారు.
సినిమాకు ఆదరణ ఎలా ఉంది?
-సినిమా రెస్పాన్స్ బాగుం ది. నేను నటించిన సినిమా ల్లో ఈ సినిమాకు వ స్తున్న రెస్పా న్స్ చూస్తుంటే ఉద్వేగంగా ఉంది. ఈ విజయాన్ని చూసి ఆనందిస్తున్నా.

06/24/2017 - 23:27

అటు దక్షిణాదిలో ఇటు ఉత్తరాదిలో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్న కథానాయిక శ్రుతిహాసన్. మొదట్లో సరైన అవకాశాలు రాని ఈమెకు ప్రస్తుతం వరుసబెట్టి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె జోరుకు చుక్కెదురైనట్లుంది. తమిళంలో తేనాండాల్ ఫిలింస్ సంస్థ ‘సంఘమిత్ర’ పేరుతో భారీ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ను ఎంపికచేశారు.

06/24/2017 - 23:26

అలనాటి అందాల నాయిక నిరోష, రాధిక చెల్లెలుగా పరిచయమైన ఆమె, కొన్ని సినిమాల తరువాత తెరమరుగయ్యారు. చాలాకాలం తరువాత మళ్లీ యునైటెడ్ ఫిలిం పతాకంపై సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందిస్తున్న ‘నువ్వు తోపువురా’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నిత్యాశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.శ్రీకాంత్, హరనాధ్‌బాబు.బి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

06/24/2017 - 23:23

వెంకీ, లాస్య జంటగా పి.యు.కె ప్రొడక్షన్స్ పతాకంపై నిర్ణయం దీపికా కృష్ణ రూపొందిస్తున్న చిత్రం 3తొలి పరిచయం2. ఇంద్రగంటి సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. నటుడు మురళీమోహన్ బిగ్ సీడీ, సీడీని విడుదల చేసి సినిమా యూనిట్‌కు అందించారు.

06/24/2017 - 23:23

రానా ప్రధాన పాత్రలో సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ పానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 3నేనే రాజు నేనే మంత్రి2. ఈచిత్రానికి సంబంధించి ట్రైలర్లు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ- కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలు పెంచాయని, నేటితో షూటింగ్ పూర్తిచేస్తున్నామని అన్నారు.

06/24/2017 - 23:22

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 3పైసా వసూల్2కు సంబంధించిన షూటింగ్ చివరిదశలో ఉంది. పోర్చుగల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. రెండు పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. తాజాగా రెయిన్ ఫైట్‌ను బాలయ్య విలన్లతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్‌గా వుంటుందని యూనిట్ చెబుతోంది.

06/24/2017 - 23:22

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా పాండీరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. శింబు, నాయనతార కాంబినేషన్‌తో ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడిన దృష్ట్యా థియేటర్ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు.

06/24/2017 - 23:21

‘చాలా రోజుల తరువాత నేను నటించిన ‘మామ్’ సినిమా నాకో స్పెషల్ సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. అయితే నటిగా పూర్తి సంతృప్తి పొందాను. ఇదొక సింపుల్ కథ. ఎమోషనల్ ఫ్యామిలీ సెబ్జెక్ట్. తల్లీ కూతుళ్లకు సంబంధించిన కథనం’ అని నటి శ్రీదేవి తెలిపారు. మాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పతాకాలపై శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామ్’.

06/24/2017 - 20:50

చైనా-ఇండియా యుద్ధ నేపథ్యంతో రూపొందించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమాకు విమర్శకులు, సమీక్షకులు ఇచ్చిన రేటింగ్‌పై సల్మాన్ పరోక్ష విమర్శలు చేశారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో నిర్మించిన ట్యూబ్‌లైట్ ఈనెల 23న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రతి రంజాన్ సందర్భంగా సల్మాన్ సినిమా రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. ఈసారి ట్యూబ్‌లైట్‌తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Pages