S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దర్శక ధీరుడు రాజవౌళి చిత్రంలో నటించాలని ఏ హీరోకు ఉండదు చెప్పండి. ముఖ్యంగా ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాన్ని తీసి అంతకంటే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన అంతకంటే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అనుకున్నారు. కానీ మినిమమ్ బడ్జెట్లోనే ఓ సాధారణ కమర్షియల్ సినిమా చేస్తానని చెప్పాడు రాజవౌళి. దాంతో ఆయన తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది.
ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ (49) రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. శంషాబాద్నుండి హైదరాబాద్కు కారులో వస్తున్న ఆయన ఔటర్ రింగ్రోడ్పై ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ మధ్య చాలావరకు ఇలాంటి ఆకస్మిక సంఘటనలతో సినీ ప్రముఖులు నేలరాలుతున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ 36 ఏళ్ల సినీ కెరీర్లో 150వ సినిమా మైలురాయిని చేరాడు. ప్రస్తుతం అరుణ్ బైద్యనాధన్ దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అరుల్ అందిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు బి.ఎన్.సి.ఎస్.పి.విజయకుమార్, ధామస్రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి మాట్లాడుతూ ప్రేమకు తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడు ప్రేమ కథతో రూపొందించామని తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్లో వరస విజయాలతో జోరుమీదున్నాడు హీరో నాని. డబుల్ హాట్రిక్కు సిద్ధమవుతున్న నాని ప్రస్తుతం ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, పాటలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమా తర్వాత నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అంటే ఎమ్సిఏ చిత్రంలో నటించనున్నాడు. దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి రానుంది.
కట్ట రాంబాబు, తారకరత్న ప్రధాన తారాగణంగా శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో శారదా చౌదరి రూపొందించిన చిత్రం ‘ఖయూం భాయ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పొర్తి చేసి ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
అందాల భామ కాజల్కు ఈమధ్య కెరీర్ కాస్త వెనుకబడింది. చేసిన సినిమాలు వరస పరాజయాలు అందుకోవడంతో కొత్త అవకాశాలు అందకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మాత్రమే చేస్తున్న కాజల్ మళ్లీ తన సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కే ‘క్వీన్’ సినిమా రీమేక్లో నటించేందుకు అంగీకరించింది.
‘నువ్విలా’, ‘రామ్లీల’, ‘జీనియస్’ లాంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన హవీష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. జవహర్ బాబు, రమేశ్వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో హవీష్ వివరాలు తెలియజేస్తూ...
యువ హీరో రాజ్తరుణ్ బాబా అవతారమెత్తాడు. తాజాగా అమలాపురంలో షూటింగ్ జరుగుతుండగా ఇటీవల విడుదలైన డిజె చిత్రం చూడటానికి ఆయన బాబా గెటప్లో ఓ థియేటర్లో సినిమా చూశాడు. తాజాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో రాజ్బాబా వచ్చాడంటూ హంగామా చెలరేగింది.
చిన్మయానంద ఫిలింస్ పతాకంపై శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చరవి, కిరాక్ ఆర్పీ ప్రధాన తారాగణంగా రవివర్మ.వి దర్శకత్వంలో ఎమ్.వి.రమణమూర్తి సమర్పణలో ఎస్.సరిత రూపొందిస్తున్న చిత్రం ‘ఇదేం దెయ్యం’ (ముగ్గురమ్మాయిలతో). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.