సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
Published Saturday, 10 December 2016పాడేరు, డిసెంబర్ 9: ప్రజావాణిలో గిరిజనులు తెలియచేసే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తెలియచేసే సమస్యలలో పరిష్కారానికి అవకాశం ఉన్నటువంటివి సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. గిరిజనుల నుంచి అందే సమస్యలను శాఖల వారీగా సమన్వయపరిచేందుకు కార్యాలయంలోని ఒక ఉద్యోగిని కో-ఆర్డినేటర్గా నియమించాలని ఆయన ఆదేశించారు.