ఇబ్బందుల్లో పేదలు
Published Saturday, 10 December 2016హైదరాబాద్, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బున్న పెద్ద వాళ్లకే ఇబ్బందులు అని గ్రామీణ ప్రజలు తొలుత భావించారని, కానీ పెద్దలు బాగానే ఉన్నారు, కానీ సమస్యలన్నీ సామాన్యులకే కలుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం అయిన కరెన్సీ అందుబాటులో లేక పోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , ఆర్బిఐ దీనిపై దృష్టిసారించారని, డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. సికిందరాబాద్లోని కస్తుర్భా గాంధీ డిగ్రీ కాలేజీలో ఎలక్ట్రానిక్ లావాదేవీలపై అవగాహన కలిగించేందుకు సమావేశం నిర్వహించారు.