నందికొండ వాగుల్లోన..
Published Tuesday, 7 June 2016బీచుపల్లి ఆంజనేయ ప్రొడక్షన్స్, షేరింగ్ టాలెంట్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సాయికిరణ్, ఆనంద్, కళ్యాణ్ ప్రధాన తారాగణంగా ఏకారి సత్యనారాయణ దర్శకత్వంలో బీచుపల్లి రఘు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చిందని, ఊటీ, గోవా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపామని తెలిపారు. లవ్ సెంటిమెంట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు.