కల్పనా చావ్లాకు మోదీ నివాళులు
Published Tuesday, 7 June 2016వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం దివంగత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లాకు ఘనంగా నివాళులర్పించారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ. 2003లో అంతరిక్షం నుంచి కిందకు వస్తుండగా స్పేస్ షటిల్కు ప్రమాదం జరిగి ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆర్లింగ్టన్ నేషనల్ సెమెటెరీ వద్ద ఆమె సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అనంతరం అమరజవాన్ల స్మారక చిహ్నానికి అంజలి ఘటించారు. నివాళులర్పించిన అనంతరం స్పేస్ షటిల్ కొలంబియా మెమోరియల్ కార్యక్రమంలో కల్పన చావ్లా భర్త, ఆమె కుటుంబసభ్యులను కలిసి మోదీ మాట్లాడారు.