డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి
Published Tuesday, 7 June 2016ఆర్మూర్, జూన్ 7: సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకోవడం కోసం ఎవరికి కూడా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సాదాబైనామాలపై పేరు మార్పిడి కోసం ఈ నెల 15వ తేది వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని యాల్ల రాములు మెమోరియల్ హాలులో మంగళవారం రెవిన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్లు, ఎంపిటిసిలు, విఆర్ఓలతో సాదాబైనామాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.