జనం కోసం పోరు ఆగదు: కోదండరామ్
Published Tuesday, 7 June 2016ఆదిలాబాద్: ఎవరేమి అనుకున్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాడితీరతామని రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మంగళవారం స్పష్టం చేశారు. తనపై తెరాస నేతలు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న విమర్శలపై ప్రస్తుతానికి స్పందించలేనని, బుధవారం జెఎసి స్టీరింగ్ కమిటీలో చర్చించాకే ఆ విషయాలు మాట్లాడతానని అన్నారు. జెఎసి సమావేశంలో ప్రాధాన్యతల మేరకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.