భూమికన్నా స్వయం ఉపాధి మిన్న
Published Thursday, 2 June 2016హైదరాబాద్, జూన్ 1 : తెలంగాణ ప్రాంతంలో దళితులను ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకువచ్చేందుకు స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. భూమి సాగుచేస్తే వచ్చే ఆదాయం కన్నా స్వయం ఉపాధి పథకాలు చేపడితే లాభాలు అధికంగా వస్తున్నాయని దళిత కుటుంబాలకు చెందిన లబ్ధిదారులు భావిస్తుండటంతో స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.