పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించుకోండి
Published Thursday, 2 June 2016చెన్నై, జూన్ 1: పెట్రోలు, డీజిలు ధరలను భారీగా పెంచుతూ పెట్రోలియం కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం డిమాండ్ చేశారు. కాగా, సిపిఎం సైతం పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కారు జరపుతున్న వృథా ఖర్చుకు ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే ఈ చర్య అని దుయ్యబట్టింది. ‘చమురు మార్కెటింగ్ కంపెనీలు అనుసరిస్తున్న ధరలను నిర్ణయించే విధానం తప్పని నేను అనేక సందర్భాల్లో స్పష్టం చేశాను. ఈ తప్పుడు విధానం ఆధారంగానే ఇటీవల పెట్రోలు, డీజిలు ధరలను పెంచడం జరిగింది’ అని జయ ఒక ప్రకటనలో పేర్కొంది.