భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు
Published Tuesday, 31 May 2016వికారాబాద్, మే 30: గత ప్రభుత్వాల అభివృద్ధి పనులు మొక్కుబడిగా చేపట్టగా, తమ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడుతోందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పుల్సుమామిడి గ్రామ సమీపంలో, పట్టణంలోని శివారెడ్డిపేట ఫిల్టర్బెడ్ వద్ద మిషన్ భగీరథ వాటర్గ్రిడ్కు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చెరువు పూడికతీత పనులకు గత ప్రభుత్వాలు ఐదు నుండి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని 46 వేల చెరువుల పనరుద్దరణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు.