ఎపిలో తిరగాలంటే వీసా కావాలా?
Published Tuesday, 31 May 2016జగ్గయ్యపేట రూరల్, మే 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగాలంటే వీసా కావాలా ఇదేమన్నా పాకిస్తానా, పరాయి దేశమా అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు బయలుదేరిన ఆయనను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా సరిహద్దు గరికపాడు వరకూ పోలీస్ వాహనంలో తీసుకువచ్చి సరిహద్దు దాటించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.