S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
పొంచి ఉన్న ‘తోడేలు’కు గోడ దూకడం స్వభావం, ఆవుల మందలోకి చొరబడడం స్వభావం, గొంతులను కొరకడం స్వభావం, ఒక ఆవును కానీ దూడను కానీ హత్య చేయడంతో తోడేలు ఆగదు, వీలైనంత మేర ఎక్కువ ఆవులను చంపడమే తోడేలు స్వభావం! ఒక ఆవును తినడం వల్ల ఆకలి తీరుతుంది, కానీ క్రౌర్యం చల్లారదు. అందువల్ల తోడేలు ఒక ఆవును తింటుంది, పది పదిహేను ఆవుల మెడలను కొరికి హత్య చేస్తుంది. ఇది దాని స్వభావం. అందువల్ల ఏ ఆవును చంపాలి? ఎందుకు చంపాలి?
భయంకర జిహాదీ బీభత్సకాండకు బలి అవుతున్న మన దేశానికీ, ఈ బీభత్సకాండను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్కూ మధ్య మరోసారి జరగవలసి ఉండిన మంత్రిత్వస్థాయి చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం ముదావహం. మన విదేశ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ అతి త్వరలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా చలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్సకారుడు ముఖ్దూమ్ షా మహ్మూద్ ఖురేషీతో సమావేశం కానున్నట్లు శుక్రవారం ప్రచారం జరిగింది.
‘తలాక్.. తలాక్.. తలాక్..’ అని మూడుసార్లు హఠాత్తుగా చెప్పడం ద్వారా వివాహబంధాన్ని విచ్ఛేదనం చేసే వికృత సంప్రదాయాన్ని నేరమని నిర్ధారించడం హర్షణీయ నిర్ణయం. ఇలా నిర్ధారిస్తున్న అధ్యాదేశం- ఆర్డినెన్స్- బుధవారం రాత్రి వెలువడిందట! ఈ అధ్యాదేశాన్ని రూపొందించి ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్లాం మతస్థులైన మహిళల వివాహ సంబంధమైన హక్కుల పరిరక్షణకు దోహదం చేసింది.
దారిద్య్రం, ఆకలి కేకలను నివారించడమే అంతిమ లక్ష్యంగా అవతరించిన మన ‘పంచవర్ష ప్రణాళిక’లు గతి తప్పాయి. ఫలితంగా పోషకాహార లోపంతో కుంగుతున్న బాలల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. పాలకులపై అక్కసుతో ఏ విపక్షం నేతలో చేస్తున్న విమర్శలు కావివి. ప్రపంచ వ్యాప్తంగా ‘పోషకాహారం- ఆహార భద్రత’పై ఐక్యరాజ్య సమితి తాజాగా వెలువరించిన నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది.
నదుల నీటి కాలుష్యం నిరంతరం పెరుగుతుండడం ‘స్వచ్ఛ భారత’ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని నిలదీస్తున్న జాతీయ వైపరీత్యం! కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి- సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- సీపీసీబీ- వారి నిర్ధారణ మేరకు గత రెండేళ్లలో ‘స్పృశించడానికి సైతం వీలులేని నీటి ప్రవాహాల’ సంఖ్య పెరిగింది.
న్యాయ ప్రక్రియలో నిహితమై ఉన్న ‘విలంబన’కు ఇది మరో నిదర్శనం మాత్రమే! ‘అభియోగం’ దాఖలయిన తరువాత ఎనిమిదేళ్లకు కాని న్యాయ ప్రక్రియలో ‘కదలిక’ ప్రస్ఫుటించలేదు. ఎనిమిదేళ్లు జరిగిపోయిన తరువాత హఠాత్తుగా ఇప్పుడు మహారాష్టల్రోని ధర్మాబాద్ న్యాయస్థానం వారు ‘ప్రక్రియ’ను వేగవంతం చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా ‘నాన్ బెయిలబుల్ వారెంట్’- ఎన్బీడబ్ల్యూ-ను జారీచేశారు.
పుండుమీద కారం చల్లడం- అన్న సామెతను నేపాల్ మార్క్సిస్టు లెనినిస్టు మావోయిస్టు కమ్యూనిస్టులు మరోసారి వాస్తవమని ధ్రువపరచింది. ‘బిమ్స్టెక్’ దేశాల సైనిక దళాలు సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రక్షణ విన్యాసాలలో భాగస్వామ్యం వహించరాదని నేపాల్ ప్రభుత్వం చివరిక్షణంలో నిర్ధారించింది. ఇది ‘బిమ్స్టెక్’ దేశాల పట్ల ప్రత్యేకించి మన దేశం పట్ల నేపాల్ ప్రభుత్వం పాల్పడిన విశ్వాస ఘాతుక చర్య...
కాంగ్రెస్ అధ్యక్షుడుగా చెలామణి అవుతున్న రాహుల్గాంధీకి తెలుగుదేశం- జాతీయ- అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం చెప్పనున్న దృశ్యం త్వరలో ఆవిష్కృతం కాగలదన్న ఉత్కంఠ రాజకీయ కుతూహలగ్రస్తులను ఆవేశించి ఉంది. తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికలలో కలసికట్టుగా పోటీచేయాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం ఈ సరికొత్త ఉత్కంఠకు ప్రాతిపదిక!
వచ్చే సంవత్సరం జరుగనున్న లోక్సభ ఎన్నికలలో ‘దగ్గరుండి’ తమ పార్టీని మరోసారి గెలిపించాలని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు భావిస్తున్నట్టు ప్రచారవౌతోంది. ఇలా లోక్సభ ఎన్నికలలో దగ్గరుండి విజయాన్ని పునరావృత్తం చేయడానికి వీలుగా ఎన్నికల వరకూ తానే పార్టీ అధ్యక్షుడుగా అమిత్ షా కొనసాగనున్నాడట!
దీర్ఘకాల చికిత్స గురించి ఎవ్వరికీ ధ్యాస ఉన్నట్టులేదు, తత్కాల ‘విచికిత్స’ను మాత్రం వేల గొంతులతో ఆవిష్కరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలను విపక్షాల వారు తిట్టిపోస్తుండడం ఈ తాత్కాలిక విచికిత్స! కానీ పెట్రోలు ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం, పెరుగుతుండడం ఏడెనిమిదేళ్లుగా కొనసాగుతున్న సమస్య! ఒకరోజు ‘్భరత్ బంద్’ చేసినంత మాత్రాన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దభీమని నేలకు దిగవు.