S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
ఆఫ్ఘానిస్థాన్లో ఆదివారం పదిహేడు మంది హిందువులు హత్యకు గురికావడం శతాబ్దుల తరబడి ఆగని జిహాదీ బీభత్సకాండకు సరికొత్త నిదర్శనం. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో అప్పటి అఖండ భారత్లో భాగంగా ఉండిన ‘గాంధార, యోన, రామఠ, ఉత్తర జ్యోతిష’ వంటి పదహారు భారతీయ రాజ్యాలు పరిఢవిల్లిన ప్రాంతాలు నేటి బలూచిస్థాన్, అప్ఘానిస్థాన్లు..
‘అభూత పూర్వ పతనం’- ఆల్టైమ్లో- అన్నది మన ‘రూపాయి’కి పట్టిన దుర్గతిని అభివర్ణించడానికి విశే్లషణ ధురీణులు కనిపెట్టిన పదజాలం. అమెరికా వారి ‘డాలర్’ ‘అంతర్జాతీయ’ వినిమయ ద్రవ్యానికి ప్రాతిపదికగా మారినప్పటి నుంచీ మన ‘రూపాయి’ సన్నబడిపోతూనే ఉంది. అందువల్ల మన రూపాయి విలువ- ఈ ‘డాలర్’తో పోల్చినప్పుడు- తగ్గిన ప్రతిసారీ ‘‘అభూత పూర్వ పతనం’’ అన్న మాటలు వినబడుతున్నాయి.
దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారి శాతం తగ్గిపోతోందన్నది ఆధికారిక నిర్ధారణ. ఇలా దేశభాషల మధ్య తెలుగుకు ప్రాధాన్యం తగ్గిపోతుండడం దశాబ్దుల విపరిణామం. ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అన్న ఘనమైన గత వైభవాన్ని తలచుకొని మురిసిపోయే తెలుగువారి సంఖ్య కూడ తగ్గిపోతోంది. తెలుగువారి హృదయ వైశాల్యం ఎక్కువ. ఈ వైశాల్యం విస్తరిస్తున్న కొద్దీ తెలుగుభాష ఆంగ్ల పదాలతో సంకరమైపోతోంది.
ఏరువాక పౌర్ణమి వ్యవసాయ మహోత్సవం! ఉభయ తెలుగు రా ష్ట్రాల ప్రభుత్వాలకు వ్యవసాయ ధ్యాస పెరుగుతుండడం హర్షణీయ పరిణామం. వ్యవసాయం నీటితో ముడివడి ఉంది. నీరు వర్షంతో ముడివడి ఉంది. ‘పర్జన్యాత్ అన్న సంభవః.’- ‘మేఘం వల్ల అన్నం ఉత్పత్తి అవుతోంది’- అన్నది సృష్టిస్థిత వాస్తవం- ‘దేవ మాతృకలు’ కావచ్చు, ‘నదీ మాతృకలు’ కావచ్చు అవి హరిత శోభలకు ఆలవాలం కావడానికి, సస్యభరితం కావడానికి నీరు వౌలిక ఆధారం.
ఆఫ్రికా ఖండానికి ‘సియాఛెల్లెస్’- సీషెల్స్- దేశంలో మన నౌకాదళానికి స్థావరం ఏర్పడలేదు. ఆఫ్రికాలోని జిబౌటీ దేశంలో చైనా పెద్ద నౌకాదళ స్థావరం ఏర్పడి ఉంది. నాలుగేళ్లుగా మన ప్రభుత్వం ప్రయత్నించింది, ‘సియాఛెల్లెస్’ ప్రభుత్వం అంగీకరించింది. కానీ సియాఛెల్లెస్ పార్లమెంటు గతవారం ఈ ప్రతిపాదనను తిరస్కరించిందట! చైనా మాత్రం గత ఏడాది మార్చిలో జిబౌటీలో తన నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.
ఆహార పదార్థాలను ‘కల్తీ’ చేసేవారికి యావజ్జీవ కారాగార నిర్బంధాన్ని విధించాలన్నది ప్రతిపాదన. దేశంలోని ఆహార, పానీయ పదార్థాలలో దాదాపు అన్నీ ‘కల్తీ’ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన వెలువడడం హర్షణీయం. ‘్భరత ఆహార స్వచ్ఛత, ప్రమాణాల పరిరక్షణ సంస్థ’- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-వారు చేసిన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే కల్తీచేస్తున్న ముఠాలకు, వ్యాపారులకు ఎంతోకొంత భయం ఏర్పడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇలా ఎందుకు జరుగుతోంది? వాతావరణ కాలుష్యం విషమించిన ప్రాంతాల్లో ఢిల్లీ నగరం ఒకటని శాస్తవ్రేత్తలు ప్రభుత్వానికి తాజాగా ఓ నివేదికను అందజేశారు. రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది అత్యధిక సంఖ్యలో వాహనాలు. రెండవది పరిపాలనా రాహిత్యం.
మాల్దీవులతో మన స్నేహ సంబంధాలు క్షీణించిపోవడానికి ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2012వ సంవత్సరంలో చేసిన విధానపరమైన తప్పిదం. తిరుగుబాటు చేసిన పోలీసుల నుంచి, కిరాయి హంతకుల నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడి నిలబెట్టవలసిందిగా అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ చేసిన విజ్ఞప్తిని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.
వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- వ్యవస్థ బీటలు వారుతోందన్నది మన దేశంలోని రాజకీయ వేత్తలలో అత్యధికులు గుర్తించని ‘మహా విషయం’. ఇలా గుర్తించకపోవడం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వా రు విదేశాల పెట్టుబడుల కోసం ఇప్పటికీ వెంపరలాడుతున్నారు.
మానవీయ సంస్కారాల సమాహారం సంస్కృతి. ‘యోగం’ వౌలికమైన మానవీయ సంస్కారం, మానవత్వం వికసించడానికి మాధ్యమం. మన దేశంలో అనాదిగా మానవీయ సంస్కారాలు వికసించాయి, పరిమళించాయి. ఈ పరిమళ పవనం ప్రపంచమంతటా విస్తరించడం సనాతన చరిత్ర. ఆద్యంత రహితమైన మానవ ప్రస్థాన చరిత్ర. ఈ చరిత్ర మళ్లీ మళ్లీ ఆవృత్తమైంది. ఈ ‘పునరావృత్తి’కి అంతర్జాతీయ యోగ దినోత్సవం వర్తమాన సాక్ష్యం! యోగ విద్య ప్రపంచానికి భారతీయుల ప్రదానం.