S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
ఇది ప్రపంచీకరణ యుగం. ‘బంక బంక’గా, ‘జిగట జిగట’గా విచిత్రమైన ‘కంపు’ను వెదజల్లే విదేశీయ సంస్థల పొడుగాటి చాక్లెట్లను ఎడమ చేతులతో నోటిలోకి కుక్కుకుంటున్న భారతీయుల యుగం.. ఆ చాక్లెట్లు, ‘బంక’ను నోటికి, ముక్కుకు పులుముకొని గొప్పగా ప్రదర్శించడం ‘జీవన విలాసం’- లైఫ్ స్టయిల్-గా మారిన భారతీయుల యుగం! ఆ చాక్లెట్లు తిని మత్తెక్కి ‘డాన్సులు’ చేస్తున్న అత్తాకోడళ్ల యుగం, ‘గంతులు’ వేస్తున్న మామా అల్లుళ్ల యుగం!!
అయోధ్య నుంచి జనకపురికి నేరుగా బస్సు సర్వీసు ప్రారంభం కానుండడం చరిత్రగతిలో సరికొత్త అధ్యాయం. అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది, జనకపురి నేపాల్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్ర, శనివారాల్లో నేపాల్లో జరుపనున్న పర్యటన సందర్భంగా ఈ బస్సు సర్వీసు ప్రారంభవౌతోంది. అయోధ్య నుంచి జనకపురికి వెళ్లే మార్గం త్రేతాయుగంలో రఘురాముడు, లక్ష్మణుడు నడచిన దారి!
చక్కెరపై ఇప్పుడున్న పన్నుతోపాటు కేజీకి మూడు రూపాయలు సెస్సు విధించాలని జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించడం దారుణం. అలా వసూలైన సొమ్ముని చెరకు రైతులకి అందిస్తామనడం ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టడమే. ఏప్రిల్లో జీఎస్టీ వల్ల రికార్డుస్థాయిలో లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటూ కేంద్ర విత్త మంత్రి ఆనందం వెలిబుచ్చారు. ఆ స్థాయిలో ప్రజల తాట వలుస్తున్నప్పుడు మళ్ళీ దొడ్డిదారిలో బాదడమెందుకు?
శుద్ధి ప్రక్రియ ద్వారా రూపొందే ఆహార పదార్థాల్లో జీవ జన్యు సాంకర్యం ఏర్పడుతోందన్న వాస్తవాన్ని ‘్భరత ఆహార భద్రత, ప్రమాణ పరిరక్షణ సంస్థ’వారు ఆధికారికంగా గుర్తించడం హర్షణీయం. ఇలా గుర్తించి ఈ ‘జీవ జన్యు సాంకర్య’- జెనటికల్లీ మోడిఫైడ్ -జిఎమ్- పదార్థాలు జనం నోళ్లలోకి చేరకుండా నిరోధించడానికి పదేళ్ల క్రితమే చర్యలు చేపట్టవలసి ఉంది.
సాంస్కృతిక జీవనం శాశ్వతమైనది, సనాతనమైనది. అంటే గతంలో ఉన్నది, వర్తమానంలో ఉంటున్నది, భవిష్యత్తులో ఉండనున్నది. రాజకీయపు సరిహద్దుల కంటె, రాజ్యాంగ వ్యవస్థల కంటె మిన్నగా ఒక ‘జాతి’ని నిరంతరం కలిపి ఉంచగలిగేది సంస్కృతి. భారత జాతీయ సంస్కారాల సమాహారమైన వౌలిక సంస్కృతికి జమ్మూ కశ్మీర్ను దూరం చేయడానికి జిహాదీ మూకలు శతాబ్దుల తరబడి యత్నిస్తున్నాయి.
అఫ్ఘానిస్థాన్లో ఆరుగురు భారతీయులు అపహరణకు గురికావడం విస్తరిస్తున్న పాకిస్తాన్ బీభత్స వ్యూహంలో భాగం. 2014లో అమెరికా దళాల ఉపసంహరణ మొదలైన తరువాత అఫ్ఘానిస్థాన్లో చైనా ప్రమేయం పెరుగుతోంది. దాదాపు పదిహేనేళ్లుగా అఫ్ఘానిస్థాన్ పునర్ నిర్మాణానికి మన దేశం వేల కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ పథకాలను అమలుచేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు పూర్వరంగంగా ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఉద్యమాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టారు. ఎన్డీఏ సర్కారుతో తెగతెంపులు చేసుకొన్న చంద్రబాబు కాంగ్రెస్కు సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకత అనే పునాదులపై తెదేపా ఆవిర్భవించింది.
‘్ఫ్లప్కార్ట్ అన్న మన దేశానికి చెందిన పంపిణీ సంస్థను ‘వాల్మార్ట్’ అన్న అమెరికా వారి ‘వ్యాపార రాక్షసి’- బిజినెస్ జెయింట్- దిగమింగడానికి రంగం సిద్ధం కావడం ‘ప్రపంచీకరణ’ ప్రగతి ప్రహసనంలో ప్రస్తుత ఘట్టం. ‘విభజించి పాలించు’ అన్నది బ్రిటన్ సామ్రాజ్యవాదులు మన దేశంలో అనుసరించిన నీతి.
ఛోటారాజన్కు, అతగాడి ముఠాకు చెందిన మరో ఎనిమిది మంది భయంకర నేరస్థులకు ముంబయిలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగృహవాస శిక్షను విధించడం హర్షణీయం. జ్యోతిర్మయి డే అనే పత్రికా రచయిత- జర్నలిస్ట్-ను 2011 జూన్ పదకొండవ తేదీన కాల్చి చంపిన ఈ దుర్మార్గులకు తగిన శిక్ష లభించడం న్యాయ ప్రక్రియ సాఫల్యానికి అరుదైన నిదర్శనం.
మన దేశం కాలుష్య నగరాల నిలయమని ఐక్యరాజ్యసమితి అనుబంధ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించడం ‘స్వచ్ఛ భారత్’ ప్రణాళికకు లభించిన చెడ్డ పేరు. ‘నమామి గంగే’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గంగానది స్వచ్ఛతను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది.