-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన భారత గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, ఇంగ్లీషులో కొనసాగించి చివరకు తెలుగుతో ముగించారు. ‘తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత చివరలో ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ముగించారు.
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముం దుకు తీసుకువెళ్లి, దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా పనిచేస్తోందని, ప్ర భుత్వానికి ప్రజలు ఈ విషయంలో పూర్తిగా సహకారం అందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి 25: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఘనత మెడ్చెల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్కు దక్కింది. ఇక్కడ అధికార పార్టీ నుండి పోటీ చేసిన కాసాని శిరీష 1698 ఓట్లు సాధించి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై 1577 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డుకెక్కింది.
హైదరాబాద్, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞను సచివాలయంలో ఉద్యోగుల చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చేయించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్తో పాటు సచివాలయంలోని ఉద్యోగులంతా పాల్గొన్నారు.
'చిత్రం... ప్రతిజ్ఞ చేస్తున్న సచివాలయ ఉద్యోగులు
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గత రెండు సంవత్సరాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన జిసీసీ బోర్డ్ మీటింగ్ వివరాలను శనివారం ఇక్కడ విడుదల చేశారు. 2018-19 సంవత్సరానికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించగా, 238 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించింది.
హైదరాబాద్, జనవరి 25: కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములకు పొంగిపోదు, కృంగిపోదని ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన గాంధీభవన్లో విలేఖర్లతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పార్టీ అధిష్టానం సమీక్షిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్ అన్నారు. ఓడిపోతే పదవులుండవని మంత్రులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారన్నారు.
హైదరాబాద్, జనవరి 25: వామపక్షాలే బహుజన ఫ్రంట్ను భుజాన వేసుకుని రాజ్యాధికారం కోసం కృషి చేయాలని ఎంసీపీఐయు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పేర్కొన్నారు.రాజ్యాధికారం లేకుండా ప్రజల వౌలిక సమస్యలైన ఇల్లు, నీరు, గుడ్డ, తిండి, వైద్యం, విద్య లాంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవని అన్నారు.
హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాల్లో న్యాయాధికారులు, న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ (ఐఏఎల్) ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ కోరారు. హైకోర్టులో న్యాయమూర్తుల స్థానాలను కూడా భర్తీ చేయాలని, అలాగే న్యాయవాదుల సంక్షేమానికి కావల్సిన నిధులను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు.
హైదరాబాద్, జనవరి 25: భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ ట్రస్టీ ప్రశాంత్ తెలిపారు.
హైదరాబాద్, జనవరి 25: ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్బాగ్లో గత 42 రోజులుగా జరుగుతున్న ఉద్యమం దేశానికే ఆదర్శనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. నారాయణతో పాటు జాతీయ సమితి సభ్యులు డాక్టర్ ఖాన్ షహీన్బాగ్ నిరసన శిబిరాలను సందర్శించారు.ఈ మేరకు నారాయణ హైదరాబాద్లో ఒక ప్రకటన విడుదల చేశారు.