S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2016 - 04:18

ముంబైలో జరిగిన ఓ విందు కార్యక్రమానికి హాజరైన అలనాటి అందాల భామలు రేఖ, మాధురి దీక్షిత్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత కంచిపట్టుచీరతో రేఖ కళకళలాడుతూ కన్పిస్తే అందమైన ఫ్యాన్సీ చీరతో మాధురి
అలరించింది.

11/19/2016 - 04:08

నెల్లూరు, నవంబర్ 18: ‘నేను తప్పు చేసినా జైలులో పెట్టించేందుకు మా నాన్న ఆలోచించడు. మా పార్టీలోని వ్యక్తులు ఎవరు తప్పు చేసినా జైలుకెళ్లాల్సిందే ’ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

11/19/2016 - 04:06

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేణుగోపాలస్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. తొలుత ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభామండపంలోని సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమాధిని రకరకాల పుష్పాలతో అలంకరించారు.

11/19/2016 - 04:04

విశాఖపట్నం, నవంబర్ 18: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉన్నట్టే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సిఎస్) కార్డు కలిగి ఉండేలా చూడాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలో జరిగిన ఉత్తమ సేవా అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

11/19/2016 - 04:01

ప్రత్తిపాడు, నవంబర్ 18: రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా లేక రాచరికమా అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి మరిచిపోయిన తరువాత ఆ హామీని అమలు చేయాలని కాపులు రోడ్డెక్కారన్నారు.

11/19/2016 - 03:58

విజయవాడ, నవంబర్ 18: భారతదేశం గర్వించదగ్గ నేత, దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. ‘ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నట్లు నేడొక ప్రకటనలో తెలిపారు.

11/19/2016 - 03:57

అంబాజీపేట, నవంబర్ 18: దరఖాస్తు చేసుకుంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ముద్రగడకు చెప్పినా వినలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైనా నిరసన వ్యక్తం చేయవచ్చని, కానీ దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరన్నారు.

11/19/2016 - 03:57

విజయవాడ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పరిస్థితిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ఒక ఎమర్జెన్సీలా భావించి సహకరించాలని ఆర్‌బిఐ, మొబైల్ ఆపరేటర్లు, తపాలా, బ్యాంక్ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

11/19/2016 - 03:56

విజయవాడ, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన పౌర సరఫరాల అధికారులతో అన్న క్యాంటీన్లపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

11/19/2016 - 03:56

విశాఖపట్నం, నవంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సెక్యూర్డ్ ఇనె్వస్ట్‌మెంట్ మేకింగ్ సర్వీసెస్(సిమ్స్) కేసులో క్రైం ఇనె్వస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సిఐడి) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సిమ్స్‌కు సంబంధించి రెండు కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎండి, డైరెక్టర్లు సహా 15 మందిపై అభియోగాలు నమోదు చేసింది.

Pages