S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీలకు ఈ నెల 28న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పార్టీ నేతలు జైరాం రమేష్, కొప్పులరాజు పాటు మేధావులతో శిక్షణ తరగుతులు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
దిల్లీ: వరుసగా రెండో రోజు బుధవారం బంగారం ధర పెరిగింది. రూ. 220 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 31,250కి చేరింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,364.30 అమెరికన్ డాలర్లుగా ఉంది. వెండి ధర ఒక్క రోజే రూ. 470 పెరిగింది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 47,820కి చేరింది.
ముంబయి: బుధవారం దేశీయ మార్కెట్లపై జీఎస్టీ బిల్లు ప్రభావం పడింది. సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయి 27,697 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 8,544 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 66.95 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
గౌహతి: అస్సాంలోని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న విమానం, ముంబయి నుంచి గౌహతి వస్తున్న విమానం స్వల్పంగా ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన ఈ రెండు విమానాల్లో సుమారు 300 మంది ప్రయాణీకులున్నారు. ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. రెండు విమానాలను రన్వేపై దింపి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
దిల్లీ: వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం దిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె చార్టర్డ్ విమానంలో దిల్లీకి చేరుకున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని కాంగ్రెస్ మీడియా ప్రతినిధి తెలిపారు.
హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలకు 12 రోజుల పాటు ప్రతిరోజూ 200 పైగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు, ఏపీలో శ్రీశైలం, విజయవాడ ప్రాంతాలకు మహత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. 50 మంది ప్రయాణికులు ఒకేసారి వెళ్లాలనుకుంటే వారి కోసం ప్రత్యేక బస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
దుబాయ్: తిరువనంతపురం- దుబాయ్ ఎమిరేట్స్ విమానం దుబాయ్లో బుధవారం అత్యవసరంగా దిగింది. ఎయిర్పోర్ట్లో ల్యాండవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో మొత్తం 275మంది ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, మరో 3 సవరణలు చేయాల్సి ఉందని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో అన్నారు. సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును భాజపా వ్యతిరేకించిందని చిదంబరం పేర్కొన్నారు.
దిల్లీ: జీఎస్టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లును జైట్లీ ప్రవేశపెట్టారు. చర్చను ప్రారంభించిన జైట్లీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ బిల్లు జీఎస్టీ అని వివరించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో జీఎస్టీ బిల్లు రూపొందించినట్లు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా ప్రకటనను ప్రభుత్వం వెలువరించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.