జీఎస్టీ బిల్లు ప్రభావం: నష్టాలతో స్టాక్మార్కెట్లు
Published Wednesday, 3 August 2016ముంబయి: బుధవారం దేశీయ మార్కెట్లపై జీఎస్టీ బిల్లు ప్రభావం పడింది. సెన్సెక్స్ 284 పాయింట్లు కోల్పోయి 27,697 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 8,544 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 66.95 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.