జీఎస్టీ బిల్లుతో పన్నుల సంస్కరణలు : అరుణ్జైట్లీ
Published Wednesday, 3 August 2016దిల్లీ: జీఎస్టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లును జైట్లీ ప్రవేశపెట్టారు. చర్చను ప్రారంభించిన జైట్లీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ బిల్లు జీఎస్టీ అని వివరించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో జీఎస్టీ బిల్లు రూపొందించినట్లు చెప్పారు. జీఎస్టీ సవరణ బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జీఎస్టీ బిల్లుపై విస్తృత సంప్రదింపులు జరిపామని వెల్లడించారు.