28న కాంగ్రెస్ శిక్షణ తరగతులు
Published Wednesday, 3 August 2016హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీలకు ఈ నెల 28న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పార్టీ నేతలు జైరాం రమేష్, కొప్పులరాజు పాటు మేధావులతో శిక్షణ తరగుతులు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.