S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/03/2016 - 04:47

రేణిగుంట, డిసెంబర్ 2: పెద్దనోట్లు రద్దుతో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఏర్పడిన నోట్ల కొరత నేపథ్యంలో ఆర్‌బిఐ నుంచి ప్రత్యేక విమానంలో రూ.365 కోట్లు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాయి. రూ.2 వేల నోట్ల కట్టలను 19 పెట్టెల్లో అమర్చి రేణిగుంటకు చేర్చారు. రేణిగుంట నుంచి పటిష్ఠ భద్రత మధ్య తిరుపతి ఆంధ్రాబ్యాంకుకు తరలించారు.

12/03/2016 - 03:56

న్యూఢిల్లీ,డిసెంబరు 2: రెండు తెలుగు రాష్ట్రాలలో ఏడు మెగా ఫుడ్‌పార్కులకు 2008-15మధ్య ఆమోదం తెలిపినట్టు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి శుక్రవారం వెల్లడించారు.

12/03/2016 - 03:54

కర్నూలు, డిసెంబర్ 2: నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక యాప్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. ఎపి పర్స్ పేర సిద్ధమవుతున్న ఈ యాప్ అన్ని స్మార్ట్ఫోన్లలో పనిచేసేలా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో అనుభవం ఉన్న యువత ఈ యాప్‌కు సంబంధించిన ప్రాథమిక వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడంతో ఆయన సంతృప్తి చెంది యాప్ తయారుచేయాలని కోరినట్లు సమాచారం.

12/03/2016 - 03:54

విజయవాడ, డిసెంబర్ 2: రెండు రోజుల పాటు జరుగునున్న హెచ్‌టి లీడర్‌షిప్ సమ్మట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. భారత దేశానికి కావాల్సిన మార్పులు అన్న అంశంపై జరుగునున్న సమ్మిట్‌లో పాల్గొంటున్న 21 మంది ప్రముఖుల్లో చంద్రబాబు ఒకరు.

12/03/2016 - 03:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గోదావరి జిల్లాల్లో ఒఎన్‌జిసి, గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ల్‌ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టాలని కేంద్రానికి టిడిపి ఎంపీ తోట నరసింహం విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని లేవనేత్తారు. గెయిల్, ఒఎన్‌జిసి పైప్‌లైన్లు అనేక సార్లు పగిలిపోయి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

12/03/2016 - 03:53

విశాఖపట్నం, (స్పోర్ట్స్) డిసెంబర్ 2: అఖిల భారత పోలీస్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లు హ్యాండ్‌బాల్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన హ్యాండ్‌బాల్ ఫైనల్ పోటీలో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 34-31 గోల్‌ల తేడాతో సిఆర్‌పిఎఫ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

12/03/2016 - 03:52

హైదరాబాద్, డిసెంబర్ 2: తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పంతం వెంకటేశ్వరావు (నానాజి)ను ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని రఘువీరా ఆయనకు సూచించారు.

12/03/2016 - 03:51

సబ్బవరం, డిసెంబర్ 2: రెండు లక్షల రూపాయలకు కన్న పేగు బంధం అమ్ముడుపోయింది. పొత్తిగుడ్డల మధ్య వెచ్చని తల్లిఒడిలో పాలు తాగాల్సిన పసికందు సంతానం లేని ఓ కుటుంబానికి తరలిపోవాల్సి వచ్చింది. సంచలనం కలిగించిన ఈ సంఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం వెదుళ్ళనరవ బిసి కాలనీలోశుక్రవారం చోటు చేసుకుంది.

12/03/2016 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీ కన్ను మహిళల మంగళ సూత్రాలపై పడిందని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. మహిళల జోలికి వెళితే ఎన్డీయే భస్మం అవుతుందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్చరించారు.

12/03/2016 - 03:50

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో వినిపించామే తప్ప తాము ఎవరినీ అగౌరవపరచలేదని, ఎటువంటి తప్పు చేయలేదని వైకాపా ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ప్రివిల్లేజస్ కమిటీ ముందు తన వాదనను వినిపించారు.

Pages