S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/30/2016 - 04:22

భీమవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించనప్పటికీ అందులోనూ కష్టాలు తప్పేట్టులేదు. ప్రతీ దుకాణంలో స్వైపింగ్ మెషీన్ (ఇ-పోస్) అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరే సూచనలు కనిపించడంలేదు.

11/30/2016 - 04:21

కడప, నవంబర్ 29: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రశే్నలేదన్నారు. కడప జిల్లా పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లెలో జగన్ మంగళవారం పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు.

11/30/2016 - 04:20

నందికొట్కూరు, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత సామాన్యుల ప్రాణాలమీదికి తెస్తోంది. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క విసిగివేశారిన కూలీ ముర్తుజావలీ(40)మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీకి చెందిన ముర్తుజావలి(40) కంకరపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

11/30/2016 - 04:19

రాజమహేంద్రవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మంచి చెడులను ఎంచిచూడటం గత 20 రోజులుగా నిత్యకృత్యం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ పండించిన వరి రైతులపై మాత్రం ఆ ప్రభావం దారుణంగా పడుతోంది. ఒకపక్క దిగుబడులు అతితక్కువగా లభిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు పండిన పంటను అమ్ముకున్నా ఇప్పట్లో నగదు చేతికి వచ్చే అవకాశం లేక అతలాకుతలమవుతున్నారు.

11/30/2016 - 04:19

గన్నవరం, నవంబర్ 29: కృష్ణా జిల్లా చిక్కవరం శ్రీ బ్రహ్మయ్యలింగేశ్వర స్వామి దేవస్థానంలోని విగ్రహాల తరలింపునకు నిరసనగా మంగళవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు నిరాహారదీక్ష చేపట్టారు.

11/30/2016 - 04:19

గుంటూరు, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి లోగోపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. ఏడాది క్రితమే ఇందుకు సంబంధించిన డిజైన్లకు రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. అంతేకాదు ఉత్తమమైన లోగోకు లక్ష రూపాయల పారితోషికాన్ని కూడా ప్రకటించింది.

11/30/2016 - 04:18

విజయవాడ, నవంబర్ 29: డిజిటలైజేషన్‌లో దూసుకుపోతున్న ఎపి ప్రభుత్వం అన్ని రంగాల్లో పారదర్శకత ప్రదర్శిస్తోంది. డిజిటలైజేషన్ రంగంలో దేశంలో ఎపి ప్రభుత్వం ప్రథమ స్థానం సాధించి, అవార్డు పొందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు శాఖల్లో డిజిటలైజేషన్ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్లు, అక్రమార్జనకు కళ్ళెం పడి అవినీతి తగ్గినట్లు నీతి అయోగ్ ప్రశంసించింది.

11/30/2016 - 04:17

అమరావతి, నవంబర్ 29: ఆయన కీలకమైన విద్యాశాఖకు మంత్రి. అందులోనూ సెట్లపై కసరత్తు జరుగుతున్న సమయం. అన్ని సెట్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? వద్దా? అంత సామర్థ్యం ఉన్న సంస్థలు అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో మంత్రిగారు మీడియాతో భేటీ అవుతారని సమాచారం వచ్చింది. వచ్చిన అరగంటలోనే మీడియా ప్రతినిధులంతా వెళ్లినా రెండున్నర గంటల వరకూ మంత్రిగారు పత్తాలేరు.

11/30/2016 - 04:17

ఏలూరు, నవంబర్ 29:రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో పర్యటించి, ఆయా కుల సంఘాలు, ప్రతినిధుల నుండి వినతులు స్వీకరించామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కె ఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నామని, మరో రెండు నెలల్లో మిగిలిన జిల్లాల పర్యటన పూర్తిచేసి, త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

11/30/2016 - 04:17

అమరావతి, నవంబర్ 29: రాష్ట్రంలో నిరాశా నిస్పృహతో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం తీసుకురావడంతోపాటు, నేతలను కదిలించేందుకు పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి మరో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల ముందు బస్సుయాత్ర నిర్వహించిన నాయకత్వం మళ్లీ ఇప్పుడు కూడా రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Pages