-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు: తూళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో పోలీసులు సోమవారం ఆకస్మికంగా దాడి చేసి నరసింహారెడ్డి, అన్నపూర్ణ అనే మావోయిస్టులను అరెస్టు చేశారు. చాలాకాలంగా వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటూ తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
తిరుపతి: ఎపిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏడాదిలోగా గద్దె దింపుతామని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బిజెపి, టిడిపిలకు వ్యతిరేకంగా పోరాడేందుకు అససరమైతే పవన్ కల్యాణ్, జగన్ల నుంచి సహకారం తీసుకుంటామన్నారు.
విశాఖ: నగరంలోని జగదాంబ జంక్షన్ ప్రాంతంలో పోలీసులు వన్వేను విధించడాన్ని నిరసిస్తూ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోమవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆయనకు మద్దతుగా టిడిపి కార్యకర్తలు, స్థానికులు పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించింది. వన్వేను ఎత్తివేసేవరకూ ఆందోళన చేస్తామని గణేష్ ప్రకటించారు.
శ్రీకాకుళం: పోలీస్ శాఖలో ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని, సంస్కరణలను ప్రవేశపెట్టి పోలీసుల పనితీరును మెరుగుపరుస్తామని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన జిల్లా పర్యటన సందర్భంగా సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్ను దాదాపు అరికట్టామని, ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఖాయమన్నారు. గత రెండేళ్లలో నేరాలను చాలావరకూ అరికట్టామన్నారు.
విజయవాడ: దివంగత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన జగ్జీవన్ జయంతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు రామవరప్పాడు వద్ద జగ్జీవన్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. మంత్రులు దేవినేని ఉమ, రావెల, ఎంపీ నారాయణ, ఎమ్మెల్యే వంశీ తదితరులు హాజరయ్యారు.
కర్నూలు: శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ఉగాది మహోత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టుచీర, తాళిబొట్టు సమర్పించారు. ఈరోజు సాయంత్రం స్వామివారు, అమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహిస్తారు.
నెల్లూరు: పార్టీ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎంతో కృషి చేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ ఎపి మంత్రివర్గంలో బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
తిరుపతి: ఆలయశుద్ధిలో భాగంగా సోమవారం ఉదయం తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 8న జరిగే ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, టిటిడి ఇవో సాంబశివరావు, పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుంటూరు: ఈపూరు మండలం గోపవారిపాలెం వద్ద సోమవారం రాత్రి కొందరు దుండగులు దారికాచి నీటి సంఘం అధ్యక్షుడు కె.కోటేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బైక్పై వస్తున్న కోటేశ్వరరావును అడ్డగించి దాడి చేశారని పోలీసులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.
గుంటూరు: స్కూల్ బస్ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రెండో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన పొన్నూరు మండలం జూపూడి వద్ద మంగళవారం ఉదయం జరిగింది.