S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/10/2018 - 04:21

విజయవాడ, సెప్టెంబర్ 9: సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపు పనులు త్వరితగతిన పూర్తిచేసి రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో కోరారు.

09/10/2018 - 04:20

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 84వేల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు శాపంలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ ఏర్పాటు చేయబోతోందంటూ శాసన మండలిలో పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ గాదె శ్రీనివాసుల నాయుడు ప్రకటన చేయటాన్ని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేల రామాంజనేయులు యాదవ్, బాజీ పఠాన్ ఆద

09/10/2018 - 04:19

విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 9: క్రొయేషియా, సెర్బియాలో జరగనున్న ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ ప్రపంచ టీటీ సర్క్యూట్‌లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ జట్లు ఆదివారం విజయవాడ నుండి పయనమయ్యాయి. ఇక్కడ జరుగుతున్న 11వ స్పోర్ట్స్ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ (సౌత్‌జోన్)లో పాల్గొన్న క్రీడాకారులు ఈ రెండు టోర్నమెంట్లకు నగరం నుండి బయలుదేరారు.

09/10/2018 - 02:59

విశాఖపట్నం: జ్వరాలతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. యంత్రాంగం కనీసం స్పందించలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని వీడియో కాన్ఫరెన్స్‌లో యంత్రాంగాన్ని కఠినంగా హెచ్చరిస్తే గానీ మత్తు వదల్లేదు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ విధిస్తున్నానని, తక్షణమే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సెలవులు రద్దు చేసుకుని విధులకు హాజరుకావాలని హెచ్చరించడంతో యంత్రాంగం కదిలింది.

09/09/2018 - 23:23

విజయనగరం, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో అత్యంత చెత్త మున్సిపాలిటీగా సాలూరు కన్పిస్తోంది...విజయనగరం పట్టణంలో రోడ్లు బాగున్నా కాలువలు చెత్తగా ఉన్నాయి.. ఇక నుంచి ఇక్కడకు ప్రతి వారం రాష్ట్ర బృందాన్ని పంపిస్తానని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె జిల్లాలోని సాలూరు ప్రాంతంలో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు.

09/09/2018 - 23:18

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎఐసిసి కార్యదర్శి డాక్టర్ కె జయ్‌కుమార్ విమర్శించారు. ఈవిషయాన్ని మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి నేత యశ్వంత్‌సిన్హా, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్‌లే తేల్చిచెప్పారన్నారు.

09/09/2018 - 23:18

మార్కాపురం, సెప్టెంబర్ 9: తెలుగుదేశం పార్టీ పాలన పూర్తిగా అవినీతిమయమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. సీపీఐ, సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చేరుకుంది.

09/09/2018 - 23:17

కాకినాడ, సెప్టెంబర్ 9: మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు తెలియడంతో తూర్పు గోదావరి జిల్లా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ రాజీనామాలతో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు, విస్తరణకు అవకాశం ఉంటుందని ఇటీవల ప్రచారం జరుగుతోంది.

09/09/2018 - 23:17

తిరుపతి, సెప్టెంబర్ 9: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరికొంతకాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణిస్తుందని మాజీ కేంద్ర మంత్రి కేవీ తంగవేలు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా 18 పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

09/09/2018 - 23:16

విజయవాడ, సెప్టెంబర్ 9: సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఈ నెల 15న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్‌లో జరగనున్న మహాగర్జన బహిరంగ సభలో పాల్గొనే ప్రజల సౌకర్యార్థం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పీ మధు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Pages