-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
పాలూ/వానీ, (ఇండోనేషియా), అక్టోబర్ 3: ప్రకృతి విపత్తు సునామీ విసిరిన పంజాతో ఇండోనేషియా విలవిలలాడుతోంది. భూకంపం, సునామీ తాకిడికి దాదాపు 1400 మంది మరణించారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు ప్రకృతి విపత్తు ఏజన్సీ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఎక్కడ చూసినా శిథిలాలే. సముద్ర తీరం వెంట నిర్మించిన గిడ్డంగులన్న కూలిపోయాయి.
హేగ్, అక్టోబర్ 3: అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో అమెరికాకు చుక్కెదురైంది. ఇరాన్పై విధించనున్న ఆంక్షలను మానవతా దృక్పథంతో నిలుపుదల చేయాలని ఐరాస అంతర్జాతీయ న్యాయస్థానం అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ దేశంపై విధించిన ఆంక్షల ప్రతిపాదనను అమెరికా ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరాన్ అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది.
వాషింగ్టన్, అక్టోబర్ 3: పాకిస్తాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం అనుసరిస్తున్న వైఖరిలో ఇప్పటికిప్పుడే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు లేవు. ముఖ్యంగా పాకిస్తాన్కు అమెరికా చేసే ఆర్థిక సాయాన్ని కొన్నాళ్ల క్రితం నిలిపివేసిన ట్రంప్ పాలనాయంత్రాంగం దాన్ని ఇప్పట్లో తిరిగి పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు.
స్టాక్హోం, అక్టోబర్ 3: అమెరికా శాస్తవ్రేత్తలు ఫ్రానె్సస్ అర్నాల్డ్, జార్జి స్మిత్తోబాటు బ్రిటన్కు చెందిన పరిశోధకుడు గ్రెగరీ వింటర్ రసాయన శాస్త్రంలో చేసిన సేవలకుగాను నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారు.
వాషింగ్టన్: శాంతి, అహింసే ఆయుధాలుగా ఎడతెరపిలేకుండా పోరాటం చేసి భారత్కు స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన గాంధీజీ సేవలను గుర్తిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కాంగ్రెస్సేనల్ గోల్డ్ మెడల్’ పౌర అవార్డుకు మహాత్ముడి పేరును సిఫార్సు చేస్తూ అమెరికా కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని అమెరికా చట్టసభలో ఆమోదించింది.
ఇటీవల ఇండొనేసియాను కుదిపేసిన భయానక భూకంపం మిగిల్చిన గుండెను పిండే విషాదం ఎప్పటికప్పుడు నిర్వేదానే్న కలిగిస్తోంది. మృతుల 1200కు పెరగడంతో కుప్పకూలిన శిథిలాల మాటున ఇంకా ఎంతమంది ఉన్నారన్న ఆందోళన కలుగుతోంది. శిథిలమైన పాలు నగర విషాద దృశ్యం ఇదయతే.. భస్మీపటలమైన అనేక ప్రాంతాల ఛాయా చిత్రాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయ.
ఇస్లామాబాద్, అక్టోబర్ 2: ఎన్నిసార్లు సమన్లు పంపినా స్వదేశానికి రావడానికి మొరాయిస్తున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. స్వదేశానికి తిరిగి రానిపక్షంలో అవమానకర రీతిలో ఆయనను వెనక్కి రప్పిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాఖీద్ మిసార్ హెచ్చరించారు.
స్టాక్హోం, అక్టోబర్ 2: భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్తవ్రేత్తలకు నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమి ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్థర్ ఆస్కిన్, ఫ్రాన్స్కు చెందిన గెరార్డ్ వౌరో, కెనెడాకు చెందిన డొన్నా స్ట్రిక్ల్యాండ్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. లేజర్ ఫిజిక్స్లో చేసిన పరిశోధనలకు ఈ బహుమతికి ఎంపిక చేశారు.
యునైటెడ్నేషన్స్, అక్టోబర్ 1: భారతదేశం అనుసరిస్తున్న ‘క్లీన్ ఇండియా’, ‘ఆడబిడ్డలకు చదివించు..రక్షించు’ నినాదాలు, పథకాలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయని, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏ దేశానికైనా వీటి ఆవశ్యకత ఉందని యునైటెట్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటానియో గూటర్రెస్ పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాల క్రితం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2019 నాటికి ‘పరిశుభ్రమైన భారతావని’’ లక్ష్యాన్ని సాధించే దార్శనికతతో స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు. అందుకు తగినట్టుగానే, 2019, అక్టోబర్ 2వ తేదీ పరిశుభ్రత జాతీయ ప్రాధాన్యతగా ఉండాలంటూ ఎలుగెత్తి చాటిన మహాత్మాగాంధీ జయంతి వార్షికోత్సవం అవుతోంది. గడచిన నాలుగేళ్లలో పరిశుభ్రత విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది.