-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
న్యూయార్క్: అమెరికాలో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వాహన రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. న్యూయార్క్ రాజధాని అల్బనీకి సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వారు వివరించారు.
ఓస్లో, అక్టోబర్ 5: ప్రపంచ వ్యాప్తంగా లైంగిక హింసను నిరోధించేందుకు విశేషంగా కృషి చేసిన కాంగో దేశానికి చెందిన వైద్యుడు డాక్టర్ డెనిస్ ముక్వేజ్, ఇరాక్కు చెందిన యజ్దీ తెగకు చెందిన నదియా మురాద్ అనే మహిళకు 2018 ప్రతిషాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచ దేశాల్లో వివిధ సంఘర్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లైంగిక హింస, దోపిడీని డాక్టర్ డెనిస్, నదియామురద్లు వీరోచితంగా ఎదుర్కొని మహిళలు.
పలూ, అక్టోబర్ 5: ఇండోనేషియాలో సంభవించిన భూకంపంతో కూడిన పెను సునామీలో గల్లంతయిన సుమారు వెయ్యిమంది జాడ తెలియడం లేదని అధికారవర్గాలు శుక్రవారం నాడిక్కడ తెలిపాయి. ఈ ప్రకృతి విలయం అనంతరం కనిపించకుండాపోయిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భయంకర భూకంపంతోబాటు సునామీ కారణంగా ఉవ్వెత్తున ఎగసిన నీటి కెరటాలు ముంచేయడంతో సులావెసీ ద్వీపంలోని పలూ సిటీ పూర్తిగా ధ్వంసమైంది. నివాస గృహాలు, కార్లు నాశనమయ్యాయి.
ఓస్లో, అక్టోబర్ 5: ప్రపంచ వ్యాప్తంగా లైంగిక హింసను నిరోధించేందుకు విశేషంగా కృషి చేసిన కాంగో దేశానికి చెందిన వైద్యుడు డాక్టర్ డెనిస్ ముక్వేజ్, ఇరాక్కు చెందిన యజ్దీ తెగకు చెందిన నదియా మురద్ అనే మహిళకు 2018 ప్రతిషాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచ దేశాల్లో వివిధ సంఘర్షణ ప్రాంతాల్లో జరుగుతున్న లైంగిక హింస, దోపిడీని డాక్టర్ డెనిస్, నదియామురద్లు వీరోచితంగా ఎదుర్కొని మహిళలు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 4: సిక్కు యాత్రికులు పాకిస్తాన్లో తమ మత పవిత్ర మందిరాలను దర్శించుకునేందుకు వీలుగా భారత్-పాక్ మధ్య కర్తాపూర్ సరిహద్దును తెరుస్తారా ? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలు నిలిచిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమైతే, కర్తాపూర్ సరిహద్దును తెరిచే అవకాశం ఉంది.
దుబాయ్, అక్టోబర్ 4: దుబాయ్లో నివసిస్తున్న ఒక భారతీయుడికి బంపర్ లాటరీ తగిలింది. ఎకాఎకిన రూ.14 కోట్ల లాటరీలో వరించింది. ఈ సొమ్మును తన స్నేహితుడి మూత్రపిండాల మార్పిడి శస్తచ్రికిత్సకు ఉపయోగిస్తానని లాటరీ విజేత మహ్మద్ కున్హీ మయ్యాల చెప్పారు. కేరళకు చెందిన 42 ఏళ్ల కున్హీ గార్మెంట్ పరిశ్రమలో 15 ఏళ్లుగా సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నారు.
సింగపూర్, అక్టోబర్ 3: గాంధీ మహాత్ముని 150 జయంతి వేడుకలు సింగపూర్లో ఘనంగా నిర్వహించారు. సన్టెక్ సిటీ కనె్వన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సింగపూర్ చైనీస్ ఆర్కెస్ట్రా ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే పాటను ఆలపించి గాంధీ జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లో గాంధీ జీవిత విశేషాలను తెలియజేసే నాలుగు నిముషాల వీడియోను ప్రదర్శించారు.
సిడ్నీ, అక్టోబర్ 3: దాదాపు రెండు దశాబ్దాల పోరాటం, నిరసనల అనంతరం మహిళలకు సంబంధించిన శానిటరీ నేప్కీన్ తదితర వస్తువులపై పన్నును రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం 2000లో జీఎస్టీని ప్రవేశపెట్టింది. కొన్ని ఆహార ఉత్పత్తులతో పాటు కండోమ్స్, సన్స్క్రీన్ తదితర వస్తువులపై 10 శాతం పన్ను రాయితీని కల్పించింది.
వాషింగ్టన్, అక్టోబర్ 3: విమర్శకుడు, వెటరన్ సౌదీ పాత్రికేయుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఇస్తాంబుల్లోని రాజుగారి కాన్సులేట్కు వెళ్లిన తర్వాత ఆయన కన్పించకుండా పోయాడని, వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. పాత్రికేయుడు జమల్ ఖషౌగి తన కాబోయే భార్యతో కలిసి ఇస్తాంబుల్లోని కాన్సులేట్కు వెళ్లాడు. ఆయన భార్యను విజిటింగ్ రూమ్లో ఉంచి లోపలికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు.
మాస్కో, అక్టోబర్ 3: రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ భారత పర్యటనను పురస్కరించుకుని నవంబర్ 18 నుంచి 28 వరకు ఉత్తర్ప్రదేశ్లో భారత-రష్యా సేనల సంయుక్త ప్రదర్శనలు జరుగనున్నాయి. ‘ఇంద్ర 2018’ పేరిట జరిగే ఈ ప్రదర్శనల్లో రష్యన్ తూర్పు మిలటరీ యూనిట్స్లోని పదాతి దళాలకు చెందిన 250 మంది సైనికులు పాల్గొంటారని ఆ యూనిట్కు చెందిన అధికారులు బుధవారం నాడిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు.