S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Others
పిల్లలు కాలు కింద పెడితే చాలు మట్టి అంటుతుందేమోనని తెగ భయపడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. పిల్లలు నేలపై ఆడితే మురికి, క్రిములు అంటుకుంటాయని భయపడుతుంటారు. అందుకే తరచూ శానిటైజర్లతో పిల్లల చేతులను కడుగుతూంటారు. అలా అసలు మురికి, మట్టి అంటనివ్వకుండా పిల్లలను పెంచుదామనుకోవడం చాలా పొరబాటు అని చెబుతోంది న్యూయార్క్లోని ఓ అధ్యయనం. ఈ అధ్యయనం ప్రకారం మట్టిలో మేలు చేసే బాక్టీరియా ఉంటుంది.
భారతీయులు అవిసె గింజలను ఎంతో పురాతన కాలం నుంచి తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలామంది వీటిని తినడం తగ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ వాటిని విడిచిపెట్టరు. ఈ గింజల్లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
దాదాపు 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. కెనడాకు చెందిన డాక్టర్ డోనా స్ట్రిక్ల్యాండ్కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. భౌతిక శాస్త్రంలో నోబెల్ను గెల్చుకున్న మహిళల్లో డోనా స్ట్రిక్ల్యాండ్ మూడోవారు.
రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది అమెరికాకు చెందిన ఫ్రానె్సస్ హెచ్. ఆర్నాల్డ్ను వరించింది. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఐదో మహిళగా ఘనత సాధించింది ఫ్రానె్సస్. ప్రొటీన్లను ఉపయోగించి జీవ వైవిధ్య ఇంధనం నుంచి ఔషధాల తయారీ వరకు.. వివిధ రంగాల్లో చేసిన వినూత్నమైన ఆవిష్కరణకుగానూ ఈ అవార్డును ప్రకటించారు. ఫ్రానె్సస్తో పాటు అమెరికాకు చెందిన జార్జ్ పి.
వాకిలిలో నిలబడితే అనంత భావాల వెల్లువ
తెల్లరంగుతో ఆ పూలు రోజూ నవ్వుతుంటయ్
నిన్న రాలినవి, రాలబోయేవీ ఆత్మ సంవేదన గుర్తులు
ఎప్పుడో అమ్మను నిమిరినట్టు
ఇప్పుడు బిడ్డను తడిమినట్టు
కాసేపు చెట్టు దగ్గర తచ్చాట
కొబ్బరి చెట్టు తన మిత్రుడని
గాలి కబుర్లను ముచ్చట్ల మీద ముచ్చట్లు బెడ్తున్నది
మా ఇంటి నంది వర్ధనం
ఆకుల మధ్య మెరిసే వెలుగును పిలుస్తూ
నేటి తరం పదేళ్లయినా నిండకుండానే ఫేస్బుక్ ఖాతాలు తెరిచేస్తోంది. వీరి నైపుణ్యం చూసి అబ్బురపోతూ.. మా పిల్లలు చాలా ‘స్మార్ట్’ అంటూ మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. ఇలా అతిగా గాడ్జెట్స్కు అలవాటు పడితే ఇబ్బందులేంటో తెలుసా.. పిల్లలకి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సంగతి అలా ఉంచితే ఎప్పటికప్పుడు చేస్తున్న సర్వేలు మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మనిషి తన తెలివిగా దినదినాభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. కానీ మాననీయ విలువలు, దయాగుణం మంటగలిసి పోతున్నాయి. మనిషి తన కోర్కెలు తీర్చుకోవడానికి ఎంతకయినా సిద్ధహస్తుడవుతున్నాడు. అందులో భాగంగా సాటిమనిషిని, పెళ్ళి పేరుతో మూడు ముళ్ళు వేసి తనలో సగంగా చేసుకున్న మగాడు కట్నకానుకల కోసం భార్యలను చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నాడు.
ఇల్లు చిన్నదా, పెద్దదా అని కాకుండా.. ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చునని నిరూపిస్తోంది నేటి ఫర్నిచర్ సెటప్. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది కాదు, ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నదే ముఖ్యం. చాలామంది ఇళ్లల్లో అన్ని గదులకంటే లివింగ్రూము, బెడ్రూములను చాలా అందంగా అలంకరిస్తారు. వంటగదిని కూడా కొంచెం మోడ్రన్గా అలంకరించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం..
వేకువజామునే నిద్రలేవడం చాలామంది కష్టమైన అంశం. ఉదయమే నిద్రలేసి వాకింగ్కో, ఎక్సర్సైజుకో వెళదామనుకుంటారు. పనులను చక్కబెట్టాలనుకుంటారు. కానీ నిద్రలేవలేరు. నిజంగా ఇలాంటి సమస్యతో సతమతమవుతున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని పాటించదగిన మార్గాలు ఉన్నాయి.
కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతాయి.
* కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్వాటర్ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.