S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మిషన్ భగీరథ వైఎస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్టీసి చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ మధ్యాహ్నాం 3.30కి బాధ్యతలు స్వీకరిస్తారు.

04/29/2016 - 06:18

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెప్పారు. తగినంత బలం లేనందున తాము ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

04/29/2016 - 06:16

హైదరాబాద్, ఏప్రిల్ 28: తాను పార్టీ మారుతున్నట్లు పార్టీ నేతలే దుష్ప్రచారం చేయడాన్ని సీ ఎల్పీనేత కే.జానారెడ్డి ఖండించారు. తనపై నమ్మకం లేకపోతే సిఎల్‌పి పదవి నుంచి తప్పుకుంటానని కూడా ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ సిఎల్‌పి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగే తీరుకు నిరసనగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

04/29/2016 - 06:16

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఈ నెల 17న జరిగిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమినరీ టెస్ట్ ఫలితాలను డిజిపి అనురాగ్ శర్మ తన కార్యాలయంలో విడుదల చేశారు. పురుషుల్లో 52, మహిళల్లో 41 శాతం ఉత్తీర్థులయ్యారు. సబ్-ఇనె్స్పక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పరీక్షలో 1,52,875 పురుషులకు గానూ 79.854 మంది ఉత్తీర్ణత సాధించగా, 22.067 మంది మహిళలకు గానూ 9.021 మంది ఉత్తీర్ణత సాధించారు.

04/29/2016 - 06:15

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కలకలం మళ్లీ మొదలైంది. తాజాగా బుధవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం గూడెంలో మూడు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పార్టీ బలోపేతంపై మావోయిస్టులు దృష్టిసారించారు. రెండు దళాల సభ్యులు కోటపల్లి మండలం నుంచి బెజ్జూరు వరకు సంచరిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది.

04/29/2016 - 06:09

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొనగా, సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

04/29/2016 - 06:07

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశానికి ఏకీకృత పరీక్షను నిర్వహించాల్సిందేనని గురువారం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ ఉత్తర్వులు వర్తిస్తాయా లేదా అనే మీమాసంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పడ్డాయి. సుప్రీం ఆదేశాలు అనేక సాంకేతిక కారణాల వల్ల ఈ రెండు రాష్ట్రాలకూ వర్తించవని ఓ పక్క న్యాయ నిపుణులు చెబుతూంటే దీనిపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచి తూచి స్పందించాయి.

04/29/2016 - 06:06

హైదరాబాద్, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు గత రెండేళ్లలో పాల్పడిన అవినీతిపై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు టిడిపి సిద్ధపడుతుందా అని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ను గత రెండేళ్లలో చంద్రబాబు, లోకేష్ అవినీతితో 1.34 లక్షల కోట్లను దోచుకున్నారన్నారు. చంద్రబాబు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారన్నారు.

04/29/2016 - 06:06

కాకినాడ, ఏప్రిల్ 28: ఎపి ఎంసెట్-2016ను ముందు ప్రకటించిన విధంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో యథావిథిగా నిర్వహిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు స్పష్టం చేశారు. దేశంలో అన్నిరకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లను ఒక కామన్ ఎగ్జామ్ ద్వారా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పద్ధతిలో ఎంసెట్ నిర్వహించడం సాధ్యం కాదన్నారు.

04/29/2016 - 06:04

చింతూరు, ఏప్రిల్ 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పొంగుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఆ రాష్ట్ర ఆర్మ్డ్ ఫోర్సు జవాను మృతిచెందాడు. పొంగుట్ట అటవీ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సు (సిఎఎఫ్) పదవ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు.

Pages