S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆమ్వేఇండియా సంస్ధ మనీ సర్క్యూలేషన్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం ఆంధ్ర, తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఆమ్వే సంస్థ కార్యకలాపాలను రాష్ట్రంలో అరికట్టాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ ప్రతినిధి ఎంవి శ్యాంసుందర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపిఎఫ్) వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 8.7 శాతానికి కేంద్రం తగ్గించినందుకు నిరసనగా ఈ నెల 29న దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఈపిఎఫ్ఓ సెంట్రల్ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వడ్డీ రేటు తగ్గించడం దారుణమని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: అమెరికాలోని సియాటెల్ నగరంలో తొలిసారిగా టిఆర్ఎస్ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలుగా తమ వంతు సహకారం అందిస్తామని కార్యక్రంలో ఎన్ఆర్ఐ సుధీర్ జలగం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలుత ప్రాణాలు అర్పించిన అమరవీరులకు రెండు నిమిషాలు వౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు ముంపుప్రభావిత నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావువేసిన పిటిషన్ను గురువారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముంపునిర్వాసితును నూత న భూసేకరణ చట్ట పరిధిలోకి తీసుకురావాలంటూ ఈ పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్తో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్ర విద్యుత్ సంస్థలకు బకాయి ఉన్న రూ. 2585 కోట్లను తెలంగాణ విద్యుత్ సంస్థలు తక్షణమే చెల్లించాలని, విద్యుత్ సౌధ విభజనకు ప్రత్యేక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు, డిస్కంల వద్ద ఏపిఎస్ఇబి ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఇంజనీర్లు గురువారం ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: ఒకే పోస్టర్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్లు కాంగ్రెస్కు ఓటు వేయమని ప్రజలకు పిలుపు ఇస్తే ఎలా ఉంటుంది? చూసేందుకు వింతగా అనిపించినా ఇప్పుడు ఖమ్మం జిల్లా పాలేరులో ఈ పోస్టర్ ఓ సంచలనం. భవిష్యత్తు రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ పోస్టర్లానే తెలంగాణ రాజకీయాలు మారనున్నాయి.
విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికొక ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని పలనాడు, వినుకొండ, మాచెర్ల, గురజాల తదితర ప్రాంతాలలోని ఆరు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. రాయపాటి సాంబశివరావు గురువారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాన మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పార్టీ ఫిరాయింపులకు ఊతమిస్తున్న రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచే సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28: దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ స్థాయి రైల్ మంత్రి రాజభాష షీల్డ్ లభించింది. హిందీ యేతర భాషలు మాట్లాడే దక్షిణాది రాష్ట్రా ల్లో దేశ అధికార భాష హిందీని అమలు చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ షీల్డ్ లభించింది.