S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 02:04

కడప, జనవరి 22: కడప జిల్లా నుంచి గల్ఫ్‌దేశాలకు రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులు ఒకేసారి కోట్లరూపాయలకు పడగెత్తాలనే దురాశతో మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల వ్యాపారంలోకి వెళ్తున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. శుక్రవారం ఈ వ్యవహారం బట్టబయలై రాయచోటి పోలీసులు హెరాయిన్ సరఫరాచేసే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హెరాయిన్ విలువ రూ.2కోట్లు పైనే ఉంటుందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

01/23/2016 - 01:48

జాతీయ సాహస అవార్డుకు ఎంపికైన మెదక్ జిల్లా బాలిక ఎనిమిదేళ్ల రుచితకు
శుక్రవారం గిఫ్ట్ ప్యాకెట్‌ను అందిస్తున్న రాష్టప్రతి ప్రణబ్

01/23/2016 - 01:16

గోదావరిఖని, జనవరి 22: దక్షణాది రాష్ట్రాల రైతులకు సరిపడే ఎరువులను అందించేందుకే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపట్టి పనులు ప్రారంభిస్తున్నామని కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహెర్ అన్నారు. ఇందుకోసం ప్రధాని ఫిబ్రవరి రెండవ వారంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

01/23/2016 - 01:16

మంచిర్యాల, జనవరి 22: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఇండియన్ బ్యాంక్‌లో బ్యాంకు ఉద్యోగితో పాటు అప్రైజర్ కొంతమంది కలసి బ్యాంకుకు నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రూ.65 లక్షల రుణాన్ని పొంది బ్యాంకుకు టోకరా వేసిన సంఘటన వెలుగు చూసింది. బంగారు ఆభరణాలను సుమారు 43మంది కస్టమర్ల ద్వారా తాకట్టు పెట్టుకున్న బ్యాంకు అధికారులు వారికి రుణాలు ఇవ్వడం జరిగింది.

01/23/2016 - 01:15

కరీంనగర్, జనవరి 22: ఎన్నికలకు ముందు దేశ ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించి, అధికారం చేపట్టిన అనంతరం వాటిని గాలికొదిలి పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కారు ఆరోపించారు.

01/23/2016 - 01:14

ఇస్లామాబాద్, జనవరి 22: పాకిస్తాన్‌లో మరిన్ని విద్యాసంస్థలపై దాడి చేస్తామని బచాఖాన్ యూనివర్సిటీలో మారణకాండకు ప్రధాన కుట్రదారుడైన పాక్ తాలిబన్ నేత ఉమర్ మన్సూర్ హెచ్చరించాడు. దేశంలో రాజకీయ, న్యాయ, రక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు మూలం ఇప్పుడున్న విద్యా వ్యవస్థేనని, అందుకే విద్యావ్యవస్థలపై దాడులు చేయడం ప్రారంభించామని ఓ వీడియో సందేశంలో అన్నాడు.

01/23/2016 - 01:14

మెల్‌బోర్న్, జనవరి 22: ఈ భూమి మీదే కాకుండా ఇతర గ్రహాల్లోనూ గ్రహాంతర జీవులున్నాయన్న కథనాలు అడపాదడపా వినిపిస్తునే ఉంటాయి, వీటి గురించి చెప్పుకోవడమే తప్ప వీటి ఉనికి ఎంత వరకు నిజం.. అసలు ఉన్నాయా? లేదా అన్నది దశాబ్దాలుగా మిస్టరీగానే కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ గ్రహాంతర జీవుల మిస్టరీని ఛేదించామని శాస్తవ్రేత్తల బృందం స్పష్టం చేసింది.

01/23/2016 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 22: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం, వాతావరణ మార్పు, స్మార్ట్ సిటీ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచిర్ శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు.

01/23/2016 - 01:12

గాంధీనగర్, జనవరి 22: పార్లమెంటులో సభాకార్యక్రమాలు స్తంభించిపోతున్న దృష్టాంతాలు రోజురోజుకు పెరుగుతుండటం పట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోందని ఆమె అన్నారు.

01/23/2016 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విషప్రభావం వల్లనే మృతి చెందిందని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు భావిస్తోంది. సునంద శరీరంలోని అవయవాలను పరీక్షించి ఎఫ్‌బిఐ ఇచ్చిన నివేదికపై మెడికల్ బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

Pages