S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/13/2018 - 23:41

కుప్పం,నవంబర్ 13 : గుడిపల్లి మండల పరిధిలోని గుత్తాల పల్లి గ్రామంలో ఒక వివాహితపై అత్యాచార యత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలాఉన్నాయి. గుత్తాలపల్లికి చెందిన వివాహిత మూడురోజుల కిందట పశువులు మేపుకుంటూ బాట గంగమాంబ దేవాలయం వద్దకు వెళ్లింది. అప్పటికే బిజిగానిపల్లి గ్రామానికి చెందిన ఎ ఆర్ కానిస్టేబుల్ తిమ్మయ్య, ఆర్మీ ఉద్యోగి చలపతి పీలకదాగా మద్యం సేవించి ఉన్నారు.

11/13/2018 - 22:18

కళ్యాణదుర్గం, నవంబర్ 13 : కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో మంగళవారం సాయంత్రం విద్యుదాఘాతంతో పట్టణానికి చెందిన పశువుల రమేష్ (33) మృతిచెందాడు. రమేష్ బైపాస్ సమీపంలో పశువులను మేపుకొచ్చేందుకు తీసుకొచ్చాడు. అయితే ఇంటికి వెళ్లే సమయంలో రోడ్డు దాడుతుండగా 8 అడుగుల ఎత్తులో ఉన్న 33 కేవీ విద్యుత్ వైర్లు తలకు తగిలాయి. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

11/13/2018 - 22:17

కణేకల్లు, నవంబర్ 13 : ఒక కేసులో సబ్‌జైల్‌కు వెళ్లాననే మనస్థాపంతో గుర్రం వెంకటేశులు (31) మంగళవారం స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రామారావు తెలిపారు. మండల కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన వెంకటేశులు ఒక కేసులో అరెస్టై సబ్‌జైల్‌కు వెళ్లాడు. ఈనేపథ్యంలో మనస్థాపానికి గురైన వెంకటేశులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించామన్నారు.

11/13/2018 - 22:14

చర్ల, నవంబర్ 13: మండలంలోని బోదనెల్లి- చింతగుప్ప అటవీ ప్రాంతంలో మంగళవారం కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీ మందుపాతర పేలడంతో ప్రత్యేక పోలీసుపార్టీకి చెందిన కె.నాగరాజు అనే కానిస్టేబుల్ చేతికి గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన నాగరాజును భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

11/13/2018 - 22:04

ఇచ్ఛాపురం(రూరల్), నవంబర్ 13: మండలంలోని లొద్దపుట్టి సమీపంలో జాతీయరహదారిపై లారీ ఢీ కొని ఒకరు మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉందని కవిటి మండలం కమలాయిపుట్టుగ గ్రామానికి ఎస్.మోహనరావు (71), ఎస్.జోగమ్మ ఇద్దరు ఇచ్ఛాపురం బ్యాంకు పనులు నిమిత్తం వచ్చి, తిరిగి వెళ్తుండగా మలుపు వద్ద లారీ ఢీ కొంది.

11/13/2018 - 22:01

నెల్లిమర్ల, నవంబర్ 13: రైలు ఢీకొట్టిన ప్రమాదంలో స్థానిక భవిత కేంద్రానికి చెందిన బదిర విద్యార్థి మృతిచెందాడు. మంగళవారం స్థానికులు అందించిన వివరాల ప్రకారం భవిత కేంద్రానికి చెందిన బదిర విద్యార్థి బీలసాయి(14) రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడు సాయి పూతికపేట గ్రామానికి చెందినవాడు. పుట్టకతోనే మూగ,చెవిటి కావడంతో స్థానిక భవిత కేంద్రంలో శిక్షణ కోసం తల్లిదండ్రులు చేర్పించారు.

11/13/2018 - 04:14

సియస్‌పురం, నవంబర్ 12: ప్రకాశం జిల్లా సిఎస్‌పురం మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ గోల్డ్‌వర్క్స్ దుకాణంలో శనివారం రాత్రి దొంగలు ఇంటిముందు భాగాన తాళాలు పగులగొట్టి దుకాణంలోకి ప్రవేశించి ఇంటి వెనుక ఉన్న బీరువా పగులగొట్టి 135 సవర్ల బంగారం దొంగిలించిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

11/13/2018 - 03:58

మంచిర్యాల, నవంబర్ 12: మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్లన్నను సోమవారం ఏసీబీ అధికారులు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ వివరాల ప్రకారం ప్రభుత్వం..

11/13/2018 - 03:54

నాగర్‌కర్నూల్, నవంబర్ 12: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ సమీపంలోని నెల్లికొండ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 160 మద్యం కార్టన్లను సోమవారం స్థానిక ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సీఐ వివరాల ప్రకారం...

11/13/2018 - 03:52

చౌటుప్పల్, నవంబర్ 12: భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆగ్రహించిన కసాయి తండ్రి సదరు పసికందును గొంతు నులిమి హత్య చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళ్తే... మండల పరిధిలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన దంపతులు సిలివేరు శివ, అక్షరలు ఎల్లగిరి శివారులో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Pages