S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/12/2018 - 22:48

గజపతినగరం, నవంబర్ 12: అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేయడంతోపాటు వేధింపులు కారణంగా కోట్ల లక్ష్మి పురుగుల మందు సేవించి ఇటీవల మృతి చెందింది. మృతురాలి వేధింపులకు ప్రధాన కారకుడైన భర్త కోట్ల సంతోష్‌ను సోమవారం బొబ్బిలి ఏస్పీ గౌతమిశాలి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

11/12/2018 - 22:30

రంపచోడవరం, నవంబర్ 12: రంపచోడవరం అటవీ శాఖ అధికారులు రెండు సిందుగ (చిరుత పులి) చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రంపచోడవరం అటవీ శాఖ రేంజర్ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రంపచోడవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న కళ్లి సత్తిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

11/12/2018 - 22:08

కొత్తగూడెం, నవంబర్ 12: సుజాతనగర్ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 లక్షల విలువైన చీరలు పట్టుబడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి రవాణా శాఖ అధికారికి పంపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

11/12/2018 - 22:03

వరంగల్ క్రైం, నవంబర్ 12: కర్ణాటకలోని బీదర్ పట్టణం నుండి మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వం నిషేధించిన గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం జనగామ చౌరస్తా లో వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

11/12/2018 - 05:43

గాజువాక/పెదగంట్యాడ, నవంబర్ 11: నాగుల చవితి సెలవు దినం ఆరుగురు కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. యారాడ బీచ్ మృత్యుకెరటం ఆరుగురు యువకులను కొట్టుకు పోయింది. సముద్రంలో గల్లంతైన ఆరుగురు యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. యారాడ బీచ్ ప్రమాదాలకు నిలయంగా మారిందన్న సంగతి విసృత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఫలితం శూన్యం. యారాడ బీచ్‌లో స్నేహానికి దిగిన అనేక మందిని మృత్యుకెరటాలు పొట్టన పెట్టుకున్న సంఘటనలు కొకొల్లులు.

11/12/2018 - 05:15

పార్వతీపురం (రూరల్), నవంబర్ 11: మనస్తాపంతో అగ్రిగోల్డ్ బాధితురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని చినబొండపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పిన్నింటి అప్పమ్మ (40) అగ్రిగోల్డ్‌లో కొంత సొమ్మును పొదుపు చేసింది. అగ్రిగోల్డ్ సంస్థను ఎత్తివేసినప్పటి నుండి మనస్తాపంతో బాధపడుతోంది.

11/12/2018 - 02:56

లింగాలఘణపురం, నవంబర్ 11: ఫోన్ చార్జింగ్ పెట్టి పాటలు వింటున్న క్రమంలో షార్ట్‌సర్క్యూటై ఒకరు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం చిరిపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బస్వగాని అనిల్ (30) బతుకు దెరువు కోసం ఉప్పల్ సమీపంలోని అనోజిగూడలో జీవనం సాగిస్తున్నాడు.

11/12/2018 - 02:10

మేడ్చల్, నవంబర్ 11: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గంగాధర్ కథనం ప్రకారం... సిద్ధిపేట్ జిల్లా ములుగు మండల బండమైలారం గ్రామానికి చెందిన తీగుల్ల నాగభూషణం గౌడ్ కుమారులు తీగుల్ల బాలశెట్టి గౌడ్(43), తీగుల్ల శ్రీనివాస్ గౌడ్(40)లు పాలవ్యాపారం చేస్తుంటారు.

11/12/2018 - 01:55

ఇటిక్యాల, నవంబర్ 11: దైవదర్శనానికి వెళ్ళి కారులో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై వస్తన్రాయక్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

11/12/2018 - 01:50

జి.కొండూరు, నవంబర్ 11: వెలగలేరులో భారీ వాహనం ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పూసల బాలకోటేశ్వరరావు (28) మృతి చెందాడు. వెలగలేరులో రోడ్డు పక్కన నిల్చుని ఉన్న బాలకోటేశ్వరరావును మలుపు వద్ద టిప్పరు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు యువకుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది నిముషాలకే అతను మృతి చెందాడు.

Pages