S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/19/2018 - 21:27

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. దర్శకుడు మారుతి కథ అందించిన ఈ చిత్రంలో సుమంత్ శైలేందర్, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్స్‌గా నటించారు. మురళీశర్మ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేసిన బ్రాండ్‌బాబు టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.

07/19/2018 - 21:25

నటిగా, నిర్మాతగా, టీవీ వ్యాఖ్యాతగా విభిన్న పాత్రలు పోషిస్తూ భిన్నమైన కథలతో సినిమాలు చేస్తోంది మంచు లక్ష్మి. తాజాగా ఆమె వైఫ్ ఆఫ్ రామ్‌గా రాబోతోంది. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 20న విడుదల చేస్తున్న సందర్భంగా నటి మంచులక్ష్మి చెప్పిన విశేషాలు... వైఫ్ ఆఫ్ రామ్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు.

07/19/2018 - 21:24

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తెలుగు సినిమాలతోపాటు అటు బాలీవుడ్ చిత్రాలలోనూ కైరా సినిమాలు చేస్తున్నారు.

07/19/2018 - 21:22

2014లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. అక్కడ ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇపుడు తాజాగా సౌత్‌లో నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల పారిస్ షెడ్యూల్‌ను ముగించుకొని ముంబైకు చేరుకుంది చిత్ర టీమ్. ఆ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి అవుతుంది.

07/19/2018 - 21:21

ఉదయ్ శంకర్, హైపర్ ఆది, దొడ్డన్న ముఖ్యపాత్రల్లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం ఆటగదరా శివ. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- నేను కమర్షియల్ సినిమాలు ఎన్నో తీశాను. కానీ ఇలాంటి కానె్సప్ట్ బేస్డ్ సినిమా చేయాలని ఎప్పటినుండో ఉంది.

07/19/2018 - 21:19

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కూడా జత కట్టేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. కేవలం నాలుగేళ్లలో ఈ అమ్మడు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఈమధ్య కాస్త వరుస పరాజయాలు టెన్షన్ పెట్టాయి. దాంతోపాటు అవకాశాలు తగ్గాయి. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి మరో క్రేజీ ఛాన్స్ దక్కింది.

07/18/2018 - 20:21

దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 5నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలయింది. కాగా ఇటీవలే విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్‌లో తాను చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఆమె నిన్న ‘ఎన్టీఆర్’ సెట్లోకి అడుగుపెట్టారు.

07/18/2018 - 20:19

టాలీవుడ్ క్రేజీ దర్శకుడు రాజవౌళి బాహుబలి తరువాత తెరకెక్కించే సినిమాగా క్రేజీ మల్టీస్టారర్‌ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటించే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు స్క్రిప్ట్‌వర్క్ కూడా జోరుగా జరుగుతుంది. ఈ సినిమాను నవంబర్‌లో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు కథను సిద్ధంచేసే పనిలోపడ్డాడు రచయిత విజయేంద్రప్రసాద్.

07/18/2018 - 20:18

చిన్న సినిమాలు చేయాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావాల్సి వుంటుంది. ఆ విషయంలో చాలా కష్టం ఉంది అని అంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. టాలీవుడ్‌లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా తనదైన మార్క్ సంపాదించుకుని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు.

07/18/2018 - 20:15

ఫిల్మ్‌మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘పెదవి దాటని మాటొకటుంది’. అదితి, టి.జి.కీర్తికుమార్ నిర్మాతలు. టి.గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. రావన్‌రెడ్డి, పాయల్ వాద్వా, డా.వి.కె.నరేశ్, మొయిన్, వౌరిస్ సడిచె, నందుకుమార్, మోహన్‌భగత్, ప్రియాంక శుక్ల కీలక పాత్రధారులు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు టి.గురుప్రసాద్ మాట్లాడుతూ..

Pages