S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘్భగమతి’ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటుచేశారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా కనిపించి ఆకట్టుకున్నాడు యువ హీరో నాగశౌర్య. ఆ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ని ఏర్పరచుకున్నాడు. తాజాగా ‘్ఛలో’ అంటూ వస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 2న విడుదలవుతోంది. రష్మిక మండన్న హీరోయిన్.
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్దేవ్ హీరోగా పరిచయం అవు తూ రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్ర నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైం ది. మాళవిక నాయర్ హీరోయిన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకుడు రాజవౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- చిరంజీవి అల్లుడు కళ్యాణ్దేవ్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా వుంది.
కొవెరా క్రియేషన్స్ బ్యానర్పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న ‘యు’ కథే హీరో..! చిత్రం మోషన్ పోస్టర్ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ - ‘ఈ సినిమా లైన్ వినగానే చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. మోషన్ పోస్టర్ని కూడా కథానుగుణంగా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్, నిక్కీ గల్రానీ జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘చెన్నై చిన్నోడు’ (వీడి లవ్లో అన్నీ చిక్కులే..) అనేది ఉప శీర్షిక టైటిల్తో తెలుగులోకి అనువదిస్తున్నారు. శూలిని ప్రొడక్షన్స్ పతాకంపై వి.జయంత్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రానికి యశ్వంత్ సాయికుమార్ సమర్పకుడు. ఎం. రాజేష్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫస్ట్లుక్ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది.
లింకన్ మెథడ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై షఫి, శ్రావణి, యాధవ్ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ సందిరి దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ, పాతూరి బుచ్చిరెడ్డి, బోగారి రాజు, మాధవరెడ్డి నిర్మిస్తున్న ‘విషపురం’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ట్రైలర్ను విడుదల చేశారు.
మహేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్వి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తున్న చిత్రం ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ... ‘ఎందుకో ఏమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఆసక్తికరంగా ఉంది.
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కే చిత్రం ఈనెల 19న సెట్స్పైకి వెళ్లగా, తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో సీనియర్ ఆర్టిస్ట్స్, సపోర్టింగ్ రోల్స్పైన కొన్ని సన్నివేశాలు షూట్ చేసిన బోయపాటి, రెండో షెడ్యూల్లో రామ్చరణ్కి సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించనున్నాడట. ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్ మొదలుకానుంది.
గ్లా మర్ హీరోయిన్గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రాశీఖన్నా మూస ధోరణిలో కాకుండా భిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అటు గ్లామర్, ఇటు అభినయం రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తూ కెరీర్ను మలచుకుంటున్న రాశీఖన్నా తాజాగా రవితేజ సరసన ‘టచ్చేసి చూడు’ చిత్రంలో నటిస్తోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
దాదాపు దశాబ్దకాలంగా సౌత్లో క్రేజీ హీరోయిన్గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ శ్రీయ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తన పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ‘గాయత్రి’ చిత్రంలో నటిస్తోంది. మోహన్బాబు కీలక పాత్రలో, మంచు విష్ణుహీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీయ చెప్పిన విశేషాలు..