S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగశౌర్య, రశ్మిక జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి, శంకర్ప్రసాద్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘ఛలో’. ఈ చిత్ర టీజర్ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. టీజర్ను ఆవిష్కరించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ, తన దగ్గర పనిచేసిన దర్శకులు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించారని, తప్పక విజయవంతమవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు.
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంలో లంక కరుణాకర్దాస్ నిర్మాతగా, ప్రతీక్ ప్రేమ్కరణ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘వాన విల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల సందర్భంగా కృష్ణారెడ్డి సీడీని విడుదల చేసారు. సంగీతం దర్శకుడు కోటి తొలి సీడీ అందుకున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త వార్తలతో మీడియాలో మారుమోగుతున్న ‘పద్మావతి’ చిత్రం విడుదల వాయిదా పడింది. దీపికా పదుకొనే ముఖ్యపాత్రలో సంజయ్లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. టైటిల్ పోరులో దీపిక నటించగా, చిత్తోడ్గఢ్ రాజు రతన్సింగ్గా షాహిద్కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్సింగ్ నటిస్తున్నారు.
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నిఖిల్కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈ హీరో ‘కిరిక్ పార్టీ’ సినిమా రీమేక్లో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు తరువాత నిఖిల్ తమిళ్లో సూపర్హిట్ అయిన ‘కనితన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టిఆర్ తన 28వ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. ఎప్పటి నుండో కోరుకుంటున్న వీరిద్దరి కలయిక ఎట్టకేలకు కుదరడంతో తారక్ అభిమానులు, సగటు ప్రేక్షకులు రాబోయే ఔట్పుట్ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
లైంగిక వేధింపులపై ఈమధ్య చాలామంది బహిరంగంగానే స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సంచలనమే క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ వేధింపులపై ఘాటు కామెంట్ చేసి సంచలనం రేపిన బాలయ్య హీరోయిన్ రాధికాఆప్టే మరోసారి స్పందించింది. బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన ఈ భామ అస్సలు తెలుగులో సినిమాలే చేయనని, ఇక్కడ మగవాళ్ల రాజ్యం ఉందని చెప్పింది.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘్భరత్ అను నేను’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. ఇటీవలే సిఎం ఛాంబర్కు సంబంధించిన పలు సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హీరో కోణం నుండి కాకుండా సామాజిక సమస్యల నేపథ్యంలో ఉంటుందని టాక్?
టాలీవుడ్లో వరుస విజయాలతో అటు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్ప్రీత్సింగ్. అటు కుర్ర హీరోల సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలో కూడా బిజీగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన రకుల్, ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్కు గట్టి పోటీగా మారింది. తాజాగా ఆమె కార్తితో కలిసి నటించిన చిత్రం ‘ఖాకి’.
విశ్వకర్మ క్రియేషన్స్ పతాకంపై శిరీష్, గౌతమి జంటగా లక్ష్మణ్ కంచరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్మీనిలయం’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్ష్మణ కంచరి మాట్లాడుతూ- ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కధ అని, సమాజంలో మహిళలపై వేధింపులు ఎలా ఉన్నాయి, వాటిని మహిళలు ఎలా ఎదుర్కోవాలి? షీ టీమ్ను ఎలా సంప్రదించాలి?
అనీష్ చంద్ర, పావని, పూర్ణి ముఖ్యపాత్రల్లో ధృవశేఖర్ దర్శకత్వంలో ప్లాన్ బి ఎంటర్టైన్మెంట్, శ్రేయా మూవీస్ పతాకంపై భరత్ అవ్వారి నిర్మించిన ‘లవర్స్ క్లబ్’ సినిమా ఈ శుక్రవారం విడుదలయింది. ఇండియన్ స్క్రీన్పై మొదటిసారి ఐఫోన్పై చిత్రీకరించిన ప్రయోగాత్మక సినిమా ఇది. ఈ సినిమా గురించి దర్శకుడు ధృవశేఖర్ వివరాలు తెలియజేస్తూ- సినిమా ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.