S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. బన్నీలోని నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించే అవకాశం కోసం రాజవౌళి కూడా ఎదురు చూస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో సెట్స్పైకి ఒక ప్రాజెక్టు వెళ్లనుంది.
శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు రూపొందిస్తున్న చిత్రం ‘రాధ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 12న చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్కార్తీక్, దీపిక జంటగా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శ్రీపాద విశ్వక్ డైరెక్షన్లో శివశంకరరావు కంటగమనేని, కె వెంకటేశ్వరరావు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అక్కడొకడుంటాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్లో జరిగింది. హరిబాబు క్లాప్ ఇవ్వగా రవీందర్రావు కెమెరా స్విచాన్ చేశారు. సి కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
దాదాపు దశాబ్దకాలంగా సౌత్లో క్రేజీ హీరోయిన్గా వెలిగిన గ్లామర్ భామ త్రిష. తరువాత కాస్త క్రేజ్ తగ్గడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవ్వాలని అనుకుంది. కానీ పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవడంతో.. త్రిష అప్సెట్ అయ్యింది. ఆ పరిస్థితి నుంచి త్వరగానే బయటపడిన త్రిష, ఇప్పుడు వరుస సినిమాలపై ఫోకస్ పెట్టింది.
కథ, కథనం నచ్చడంతోపాటు ఆత్మీయులు అడిగిన ఆబ్లికేషన్స్ కోసం స్టార్ హీరోయిన్లు అప్పుడప్పుడు ప్రత్యేక పాటల్లో దర్శనమిస్తుంటారు. స్టార్ హీరోయిన్లు ఆ పాటలో నర్తించడం వల్ల సినిమాకి మరింత హైప్ వస్తుంది. ఇలాంటి ఆబ్లిగేషన్తోనే దీపికా పదుకొనె ‘రాబ్తా’ టైటిల్ సాంగ్లో నర్తించింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాబ్తా’.
అశోక్, ఈష జంటగా సుకుమార్ రైటింగ్స్ పతాకంపై హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్, డిఎస్పిఎస్పి విజయ్కుమార్, ధామస్రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. చిత్రానికి సంబంధించిన పోస్టర్ను హైదరాబాద్లో దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, సుకుమార్ సంయుక్తంగా విడుదల చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని ఈ వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హరీశ్, అవంతిక జంటగా ఆర్జె సినిమాస్ పతాకంపై జయ బి దర్శకత్వంలో బిఎ రాజు రూపొందించిన చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం గురించి దర్శకురాలు బి జయ మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి చూసేలా చిత్రం రూపొందించామన్నారు.
జై అంజలి జంటగా 70 ఎంఎం ఫిలింస్ పతాకంపై ఎస్ శినీష్ దర్శకత్వంలో టిఎస్ అరుణ్ బాలాజీ, కందస్వామి నందకుమార్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బెలూన్’. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఒక పాత్రతో హీరోయిజం చూపించటం -సినిమాకు రొటీన్. ఒక హీరో రెండు పాత్రలు పోషిస్తే.. సమ్థింగ్ స్పెషల్. అదే హీరో ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషిస్తే -ఓహ్.. అభిమానులు చెలరేగిపోతారు. అవును, ఇప్పుడు సౌత్ హీరోలకు అలాంటి ‘మూడే’వచ్చింది. ఒకర్ని చూసి ఇంకొకరు.. ఒకటీ రెండూ కాదు మూడేసి పాత్రల్ని అలవోకగా చేసేసేందుకు కథలు ఎంచుకుంటున్నారు. అంటే టెక్నికల్గా చేసేది ఒకే సినిమా అయినా..
స్మైల్ పిక్చర్స్ పతాకంపై అర్జున్, భరత్, పావని, సీమాచౌదరి ప్రధాన తారాగణంగా ఎన్ రామస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అలీ క్లాప్ ఇవ్వగా బాపినీడు కెమెరా స్విచాన్ చేసారు. తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.