S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా పరిచయం అయింది బాలీవుడ్ భామ సాయేషాసైగల్. బాలీవుడ్లో ది గ్రేట్ యాక్టర్ దిలీప్కుమార్ మనవరాలైన ఈమెకు పాపం మొదటి సినిమా పెద్ద నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో ఒక్క అవకాశంకూడా రాలేదు. దాంతో అటు బాలీవుడ్లోకూడా గట్టి ప్రయత్నాలే చేసి ఓ సినిమా పట్టేసింది.
గోవా భామ ఇలియానా బాలీవుడ్లో హీరోయిన్గా పాపులర్ అవ్వాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అడపాదడపా వచ్చిన అవకాశాలను అందుకుంటూపోతున్న ఈ భామ బాలీవుడ్లో తనదైన గ్లామర్ను చూపించాలని అప్పుడప్పుడు హాట్ హాట్గా ఫొటోషూట్లకు ఫోజులిచ్చి సంచలనం రేపేది. ఇక ఈమధ్యే అక్షయ్కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఈ భామకు మంచి మార్కులే పడ్డాయి.
వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన ఎన్టీఆర్కు సాటి మరొకరు లేరన్నది అందరి మాట. సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ మాటకూడా అదే అయినా తనదైన శైలిలో స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అలనాటి మేటి నటుడు ఎన్టీఆర్ను మించిపోయేలా మనవడు జూనియర్ ఎన్టీఆర్ పరిణతి చెందుతున్నాడని వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
రామ్చరణ్ కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రం చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 10 పోస్టర్లను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ నక్షత్రం చిత్రానికి సంబంధించిన లోగో, ప్రచార చిత్రాలు ఆసక్తిరేపేలా వుంటాయని, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తోందని తెలిపారు.
ప్రఖ్యాత దర్శకురాలు, నిర్మాత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మీరానాయర్ అస్వస్థతకు గురయ్యారు. ఉగాండాలోని కంపాలలో ఆమె తాజా చిత్రం ‘క్వీన్ ఆఫ్ కత్వా’కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తనయుడు తెలిపారు. ఆస్కార్ విజేత లుపిత్ న్యన్గా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘క్వీన్ ఆఫ్ కత్వా’ వచ్చే నెలలో విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలు రెండూ మిలియన్ డాలర్ క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఆయన చిత్రం జనతా గ్యారేజ్ కూడా ఓవర్సీస్లో అద్భుతమైన ఆదరణ పొందుతూ కలక్షన్లను రాబడుతూ, మిలియన్ డాలర్స్ క్లబ్లో తాజాగా చేరింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మిలియన్ డాలర్ క్లబ్లో హ్యాట్రిక్ కొట్టినట్టుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న చిత్రం వైశాఖం. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఈ నెలలో పూర్తిచేస్తామని అన్నారు.
సాగర్, రాగిణి నంద్వానీ, సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా రామదూత క్రియేషన్స్ పతాకంపై కె.వి.దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్కుమార్ రూపొందించిన చిత్రం సిద్ధార్థ.
శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై దిలీప్, పూనమ్కౌర్, అక్షిత ప్రధాన తారాగణంగా జి.ఎస్.వి.సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ,నరేందర్, విజయానంద్, సురేష్గౌడ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రణయం’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా నటుడు రఘుబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
‘బిచ్చగాడు’ చిత్రాన్ని అందించిన నిర్మాతలు తాజాగా మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ప తాకంపై అందిస్తున్న ఈ చిత్రంలో బేబి సారాఅర్జున్ (నాన్న ఫేమ్) ప్రధాన పాత్రలో నటించడం విశేషం. మలయాళంలో విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి ప్రశంసలు లభించాయని, ఓ చిన్నారి చేసిన సాహసం ఎలాంటి పరిణామాలకు దారితీసింది?