-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
జైపూర్, ఆగస్టు 18: గుజ్జర్లు, ఇతర కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఒబిసిల కోటాను ఇప్పుడున్న 21 శాతంనుంచి 26 శాతానికి పెంచనుంది. గురువారం రాత్రి గుజ్జర్ల ప్రతినిధి బృందంతో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒక ఏకాభిప్రాయం కుదరడంతోవచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, రాజకీయ నేపథ్యం, ప్రసంగాలు నేటి తరం యువతకు దిక్సూచి లాంటివని కేంద్రమంత్రులు రాజీవ్ ప్రతాప్ రూడీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలపై ‘‘అలుపెరగని గళం....విరామమెరుగని ప్రయాణం’’ పేరుతో వెలువడిన పుస్తకాల సంకలనంపై శుక్రవారం నాడు ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో చర్చా కార్యక్రమం జరిగింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇంత వరకూ వచ్చిన దానికి భిన్నంగా ఈసారి పద్మాఅవార్డులు ఎవరికి అందబోతున్నాయన్నదానిపై ఇప్పటి నుండే ఉత్కంఠ నెలకొంది. 2018 సంవత్సరానికి ప్రదానం చేసే ఈ అవార్డులకు ఎవరిని నామినేట్ చేయాలనే అంశాలను ప్రభుత్వం ప్రజలకే వదిలేయడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది.
గోరఖ్పూర్, ఆగస్టు 18: గోరఖ్పూర్ బిఆర్డి ఆస్పత్రిలో పిల్లల మరణాలకు ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బృందం తేల్చి చెప్పింది. ఆక్సిజన్ సిలిండర్ల లోటుకు సంబంధించి ఎలాంటి అప్రమత్త హెచ్చరిక ఇవ్వలేదని, వాస్తవానికి అలాంటి పరిస్థితి ఏర్పడితే వారం రోజులు ముందే చెప్పాల్సి ఉంటుందని ఐఎంఎ బృందం తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: తెలంగాణాలో ఏడు, ఆంధ్రలో ఐదు సెగ్మెంట్లతోపాటు దేశం మొత్తంమీద 350 లోక్సభ స్థానాలపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారిస్తున్నారు. 2019లో జరిగే లోక్సభ ఎన్నికల్లో 350 స్థానా లు కైవసం చేసుకోవటం ద్వారా రెండోసారీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేందుకు షా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఫైవ్స్టార్ హోటటల్లో మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటుగా ఆమె చీరలాగి వివస్తన్రు చేయడానికి యత్నించిన సెక్యూరిటీ మేనేజర్ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట చేశారు. ఈ సంఘటనపై బాధితురాలు గత నెల 30నే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చెన్నై, ఆగస్టు 18: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు ఏకమవడం ఖాయమనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉన్నప్పటికీ కొన్ని చిక్కుముడులు ఈ విషయంలో ముందు కు సాగకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఇ.పళని స్వామి మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించారు.
గత కొన్ని నెలలుగా ఇన్ఫోసిస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు శుక్రవారం ఆకస్మిక మలుపు తిరిగాయి. నారాయణ మూర్తి సారథ్యంలోని కీలక వ్యక్తుల కూటమితో వివాదాలమయంగా మారిన పరిస్థితులను తట్టుకోలేక విశాల్ సిక్కా సంచలన రీతిలో రాజీనామా చేశారు. ఈ పరిణామం పది మిలియన్ డాలర్ల ఇన్ఫోసిస్ కంపెనీని కుదిపేసింది. దీని ఫలితంగా దాదాపు 25వేల కోట్లమేర ఈ ఐటి సంస్థ ఒక్కరోజులోనే నష్టపోయింది.
మహాత్మాగాంధీ సిరీస్లో త్వరలో ఆర్బిఐ జారీ చేయనున్న 50 రూపాయల నోటు నమూనా ఇది. రెండోపక్క హంపి రాతిరథం చిత్రాన్ని ముద్రించారు. ప్రస్తుతం ఉన్న 50 రూపాయిల నోటు కంటే ఎన్నో రకాలుగా భద్రతా పరమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కొత్త నోటు జారీ అవుతున్నా పాత 50 రూపాయల నోట్ల చలామణికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆర్బిఐ తెలిపింది. అలాగే, కొత్త 20 రూపాయల నోట్లను సైతం ఆర్బిఐ చలామణీలోకి తీసుకురాబోతోంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీపై సంఘటిత పోరాటానికి పిలుపునిస్తూ డజనుకు పైగా ప్రతిపక్ష పార్టీలు గురువారం ఒకే వేదికపైకి వచ్చాయి. జెడి (యు) తిరుగుబాటు నాయకుడు శరద్ యాదవ్ ‘సంఝి విరాసత్ బచావో (మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం) పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అయింది.