-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువులాంటిదైన పార్లమెంటు సెంట్రల్ హాల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి తైలవర్ణ చిత్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: తెలంగాణలోని రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని టీఆర్ఎస్ సభ్యుడు బీ వినోద్కుమార్ మంగళవారం లోక్సభ జీరో అవర్లో డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిపై భారీ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, విస్తరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. రక్షణ రహస్యాలను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి పది రోజుల ముందే వెల్లడించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ గిరిజన విభాగ చైర్మన్ కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే మంగళవారం ఇక్కడ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీ ఏపీ భవన్లో మాజీ కేంద్ర మంత్రి భేటీ అయ్యారు.బాబును కలిసిన తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ‘నేను టీడీపీలోకి వస్తానంటే చంద్రబాబు అంగీకరించారు.
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించిన ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు కోరిన విధంగా ప్యాకేజీలో మార్పులు, చేర్పులు కూడా చేశామని గోయల్ వెల్లడించారు. వైపాకా సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గోయల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సారధ్యంలోని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ కోరింది.
న్యూఢిల్లీ: రాఫెల్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సారి ఆయన ఈ-మెయల్ను ఆధారంగా చూపించారు. రాహుల్ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ డీల్కు ముందు అనిల్ మినిస్టర్స్ ఆఫీసుకు వెళ్లారని, ఒప్పంద పత్రం తయారీలో ఉన్నదని, ప్రధాని విజిట్ చేసే సమయంలో దానిపై సంతకాలు జరుగుతాయని కూడా ఆ మెయిల్లో ఉంది. ప్రధాని మోదీ విజిట్ కన్నా ముందే..
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ 17 పేజీల వినతిపత్రాన్ని అందజేసింది. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము న్యాయం కోసం పోరాడుతుంటే బీజేపీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అహ్మదాబాద్: మహాకూటమి ఏర్పాటుచేస్తున్న నాయకులు అంతా రాష్టస్థ్రాయి నాయకులేనని, ఆ కూటమికి నాయకుడు ఎవరో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. ఆయన మంగళవారంనాడు ‘మెగా పరివార్-బీజేపీ పరివార్’ పేరుతో ఏర్పాటుచేసిన ప్రతి ఇంటిపై బీజేపీ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: ముజఫర్పూర్ వసతి గృహ కేసును విచారిస్తున్న ఎస్కే శర్మను బదిలీచేయటాన్ని కోర్టు ధిక్కారణ కిందకు పరిగణిస్తూ సీబీఐ తాత్కాలిక మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు అసాధారణ శిక్ష వేసింది. మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోమని ఆదేశించింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. దీనికి సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే..