S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/14/2018 - 02:35

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభివృద్ధికి చేసిన కృషి, నవ భారత నిర్మాణానికి చేసిన ప్రణాళికలను తక్కువ చేసి చూపుతున్నారని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ రాసిన నెహ్రూ అనే పుస్తకాన్ని ఆమె ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

11/14/2018 - 02:25

న్యూఢిల్లీ, నవంబర్ 13: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో దోపిడీ జరిగిందన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సుప్రీం కోర్టు ముందే అంగీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే వైమానిక దళాన్ని సంప్రదించకుండానే ఈ కాంట్రాక్టులో మార్పులు చేసిన విషయాన్ని ఆయన ఒప్పుకున్నారని రాహుల్ అన్నారు.

11/14/2018 - 02:41

చెన్నై: బీజేపీ ప్రమాదకరమైన పార్టీనా కాదా అనే విషయాన్ని ప్రజలు తేలుస్తారని తమిళ సినీ సూపర్‌స్టార్, క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన రజనీకాంత్ మంగళవారం ఇక్కడ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఆయనను వ్యతిరేకించే పది పార్టీల కంటే బలమైన వారని చెప్పగలనని ఆయన పేర్కొన్నారు. ‘ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పది మంది కూటమిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరు బలమైన వ్యక్తి ?

11/14/2018 - 02:22

బెంగళూరు, నవంబర్ 13: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్‌కుమార్ అంత్యక్రియలు మంగళవారం అశ్రు నయనాల నడుమ ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడి చామరాజపేట శ్మశానవాటికలో జరిగాయి. వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆఖరి సోదరుడు నందకుమార్ స్మార్థబ్రాహ్మణ ఆచారాల మేరకు వేద మంత్రోచ్ఛారణల నడుమ అనంత్‌కుమార్ చితికి నిప్పంటించారు.

11/14/2018 - 02:21

న్యూఢిల్లీ, నవంబర్ 13: పన్ను చెల్లింపులకు సంబంధించి 2011-12 నాటికి కేసును పునర్విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే నెల 4వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ఐటీ కేసులో తుది వాదనలు వింటామని కోర్టు పేర్కోంది.

11/14/2018 - 02:20

న్యూఢిల్లీ, నవంబర్ 13: శబరిమల ఆలయంలో అన్ని వయస్సులకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పించడంపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా గతంలో ఈ విషయమై ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పునస్సమీక్షిస్తామని కోర్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన సుప్రీం కోర్టు ఈ అంశాన్ని కోర్టులోనే విచారిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

11/14/2018 - 04:57

న్యూఢిల్లీ, నవంబర్ 13: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై మూడో పక్షంతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హాత్యాప్రయత్నం వెనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నదనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు.

11/14/2018 - 01:13

న్యూఢిల్లీ, నవంబర్ 13: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం కర్నాటక భవన్‌లో సమావేశమై రెండో జాబితా తయారీపై దృష్టి కేంద్రీకరించారు.

11/13/2018 - 16:49

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆదాయ పన్ను అంచనాల కేసును విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఢిల్లీ హైకోర్టు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.సోనియా రాహుల్ తరపున కపిల్ సిబాల్, పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

11/13/2018 - 16:46

బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అనంతకుమార్ పార్థీవదేహాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అనంతరం అక్కడ ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం నేషనల్ కళాశాలకు తరలించారు. అక్కడ నుంచి అంతిమయాత్ర కొనసాగింది. చామరాజ్ పేట్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Pages