S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/14/2018 - 22:32

న్యూఢిల్లీ, నవంబర్ 14: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు మరోసారి నిరాకరించింది.

11/14/2018 - 22:31

లక్నో, నవంబర్ 14: ఒక్క అయోధ్యలోనే కాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్నిచోట్లా ముస్లింలంతా సురక్షితంగా జీవిస్తున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు.

11/14/2018 - 22:30

చెన్నై, నవంబర్ 14: ప్రధాని నరేంద్రమోదీని పొగుడుతూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అధికార ఏఐడిఎంకె పార్టీ మండిపడింది.

11/14/2018 - 22:29

చెన్నై, నవంబర్ 14: తరచు విదేశీ పర్యటనల్లో మునిగితేలుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో చాలా తక్కువ కాలం ఉంటున్నారని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విమర్శించారు. ఆయనను ప్రవాస ప్రధాని’ అని ఎద్దేవా చేశారు. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న స్టాలిన్ తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ప్రధాని మోదీకిగానీ ప్రజాస్వామ్యం అంటే ఇష్టం, నమ్మకం లేవని వ్యాఖ్యానించారు.

11/14/2018 - 22:28

బరేలీ (యూపీ), నవంబర్ 14: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాల్లో ఒక ఇంటిని దోపీడీ చేసేందుకు వెళ్లిన దుండగులు తమకు అడ్డు వచ్చిన ఇంటి యజమానిని కాల్చి చంపారు. యజమాని తమ్ముడిని చితకబాదారు. ఈ ఘటన బరేలీ జిల్లా బామూరా ప్రాంతంలోని బైమాన్యా గ్రామంలో జరిగింది. దుండగులు రాకతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చామన్ అనే వ్యక్తి మరణించాడు.

11/14/2018 - 22:26

లక్నో, నవంబర్ 14: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగానే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ఉంటుందని, హిందువులంతా ఇదే నమ్మకంతో ఉన్నారని విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చాంపట్ రాజ్ బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈ విషయంలో దేశంలో అన్నివర్గాల ప్రజలు హిందువుల సెంటిమెంటును అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

11/14/2018 - 22:25

ముంబయి, నవంబర్ 14: ముంబయిలో ఛాత్ పూజ ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిసాయి. లక్షలాది మంది భక్తులు జుహూ బీచ్‌కు చేరుకుని ఉదయించే సూర్యునికి నమస్కారాలు సమర్పించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, నగర బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ మంగళవారం సాయంత్రం ఈ ఉత్సవానికి హాజరై పూజ చేసి సూర్యునికి నమస్కారాలు సమర్పించారు. వారికి ఛాత్ ఉత్సవ మహాసంఘ్ స్వాగతం పలికింది.

11/14/2018 - 17:54

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. రాకెట్ కౌంట్‌డౌన్ ఈరోజు మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5.08 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో సన్నాహాక సమావేశం జరిగింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ2 వాహననౌక కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన జీశాట్-29 ఉప గ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లింది.

11/14/2018 - 16:30

గాంధీనగర్: గుజరాత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారంనాడు వచ్చారు. అయితే విగ్రహం లిఫ్ట్‌లో వెళుతుండగా లోడ్ ఎక్కువై రెండుసార్లు ఆగిపోయి ఉప ముఖ్యమంత్రి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్రమత్తమైన సిబ్బంది టెక్నీషీయన్ల సాయంతో ఆయన బయటపడ్డారు.

11/14/2018 - 16:29

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ జోసఫ్ ధర్మాసనం వైమానిక దళ అధికారులను ప్రశ్నించింది. కాగా ఈ ఒప్పందంపై న్యాయసమీక్షను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.

Pages