S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/12/2018 - 17:41

భీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు మావోయిస్టులకు, జవాన్లకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఐదు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా ముగ్గురు కోబ్రా కమెండోలు తీవ్రంగా గాయపడ్డారు.

11/12/2018 - 17:40

చత్తీస్‌గఢ్: రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ ముగిసింది. మొత్తం 18 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం మూడు గంటలకు 47.18 శాతం పోలింగ్ నమోదు అయింది.

11/12/2018 - 16:49

న్యూఢిల్లీ: మహాకూటమిలో అభ్యర్థుల ప్రకటన ఇంకా కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ ప్రెశిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కుంతియా, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. అభ్యర్థుల లిస్ట్‌ను ఈ రోజే ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

11/12/2018 - 16:47

భువనేశ్వర్: రాష్ట్రంలోని నబరంగపూర్ జిల్లాలోని జరిగాన్ సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు లోయలోపడి ముగ్గురు మృతిచెందగా 11మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

11/12/2018 - 16:45

చత్తీస్‌గఢ్: కులం పేరుతో దేశ ప్రజలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన బిలాస్‌పూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరంభం, ముగింపు కూడా వారసత్వంతోనే నడుస్తుందని ఆయన అన్నారు. మావోయిస్టులకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను విప్లవకారులు అని ప్రధాని విమర్శించారు. నోట్ల రద్దును ఆయన సమర్థించారు.

11/12/2018 - 14:01

న్యూఢిల్లీ: సీబీఐ వివాదానికి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మను ప్రశ్నించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. సీల్డు కవర్‌లో దర్యాప్తు నివేదిక వివరాలను ఉంచి కోర్టులో సమర్పించారు. కోర్టు గడువు ఈనెల 10న ముగియటంతో సీవీసీ తన నివేదికను కోర్టులో సమర్పించింది. కాగా తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయదా వేసింది.

11/12/2018 - 12:46

బోపాల్: ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తాము అసాధారణమైనవిగా భావించటం లేదని బీజీపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన మధ్య్రపదేశ్ ఎన్నికల పోలింగ్ బూత్ స్థాయ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అన్నారు.

11/12/2018 - 12:28

న్యూఢిల్లీ: అయోద్య వివాదం కేసుపై హిందూసభ వేసిన ముందస్తు విచారణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వేసింది. ఈ కేసును జనవరికి వాయిదా వేశామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసుపై అప్పిళ్లన్నీ జనవరిలో వస్తున్నందున ముందస్తు విచారణ చేపట్టలేమని పేర్కొంది. అఖిల భారత హిందూ మహసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా పిటిషన్ దాఖలు చేశారు.

11/12/2018 - 15:57

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 14శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. 90 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలిదశలో 18 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో ఒక్క ఓటు కూడా నమోదు కాని భేజ్జీ, గోర్కా ప్రాంతాల్లో సైతం ఓట్లు వేస్తున్నారు.

11/12/2018 - 12:23

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దేశ సేవ కోసం యుక్తవయసులో రాజకీయాల్లోకి వచ్చారని, మంచి మిత్రుడ్ని కోల్పోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Pages