-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
పనాజీ, నవంబర్ 12: భారతీయ ఆరోగ్య సాధనమైన యోగా విషయంలో 70, 80దశకంలో ఉన్న ప్రతికూల భావన తొలగిపోయిందని, ఇప్పుడు ఈ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆహ్వానిస్తున్నాయని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. సోమవారం ఇక్కడ కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్తో కలిసి అంతర్జాతీయ యోగా కనె్వన్షన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
పఠాన్కోట్, నవంబర్ 12: కాశ్మీర్లో శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను నిర్మూలించడమే ప్రభుత్వ విధానమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అదే విధంగా యువత ఉగ్రవాద బాట పట్టకుండా సైన్యం తన వందు కృషి చేస్తోందని సోమవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
చిత్రాలు.. చత్తీస్గఢ్ తొలి దశ పోలింగ్ సందర్భంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన
సుక్మా జిల్లాలో ఓ చెట్టుకింద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం
*సుక్మా జిల్లాలోని మరిగూడలో ఓటు వేసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది
ఐజ్వాల్, నవంబర్ 12: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా ఎన్నికల అఫిడవిట్లో కోటి రూపాయల చరాస్తులు ప్రకటించారు. అలాగే వ్యవసాయ భూములు, మిగతావి కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయలు చూపించారు. ఈనెల 28న మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్లో 5 లక్షల రూపాయల నగదును పేర్కొన్నారు.
భోపాల్, నవంబర్ 12: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తామని ఎక్కడా చెప్పలేదని, బీజేపీ ఓ పథకం ప్రకారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని సోమవారం ఇక్కడ విరుచుకుపడ్డారు.
జైపూర్, నవంబర్ 12: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి వసుంధర రాజే, స్పీకర్ కైలాష్ మేఘ్వాల్తో సహా 131 మందితో బీజేపీ తొలిజాబితా విడుదల చేసింది. వచ్చే నెల 7న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 200. తొలి జాబితాలో పలువురు సీనియర్, సహాయ మంత్రులకు చోటు కల్పించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం అర్థరాత్రి ప్రకటించారు. కాంగ్రెస్ అధినాయకత్వం పలు దఫాలు జరిపిన చర్చలు తరువాత 65 మంది పేర్లతో జాబితాను ఖరారు చేసింది. మంగళవారం నాడు జాబితా విడుదల చేస్తారని తొలుత వార్తలొచ్చిన సోమవారం పొద్దుపోయాక 65 మందితోకూడిన తొలి జాబితాను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి జాబితాలను దశలవారీగా ప్రకటిస్తారు.
బిలాస్పూర్, నవంబర్ 12: పెద్ద నోట్ల రద్దుపై తనను తూర్పారబడుతున్న కాంగ్రెస్ నేతలు సోనియా,రాహుల్పై ప్రధాని మోదీ తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘ఆర్థిక అవకతవకలకు పాల్పడి ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఈ తల్లీ కొడుకుల నుంచి నా నిజాయితీకి ఎలాంటి ప్రశంసా పత్రం అవసరం లేదు’అని అన్నారు.
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్నారు. 59 ఏళ్ల కుమార్ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయే వరకూ భార్య తేజశ్వినీ, ఇద్దరు కుమార్తెలు పక్కనే ఉన్నారని శంకర ఆసుపత్రి వైద్యుడు నాగరాజా వెల్లడించారు.
బీహార్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్నగర్ వసతి గృహాల బాలికలపై జరిగిన అత్యాచారాల కేసుకు సంబంధించి మాజ మంత్రిణి మంజూవర్మను పట్టుకోలేని పోలీసులపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తంచేసింది. నెల రోజులైనా ఆమెను పట్టుకోలేక పోవటం ఆశ్చర్యం కలిగిస్తుందని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మా ముందు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.