ఎంపీల జీతాల పెంపుపై ప్రభుత్వం పరిశీలన
Published Wednesday, 31 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంట్ సభ్యుల జీతాల్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఎంపీల జీతాలు, అలవెన్స్ల పెంపుపై ఏర్పాటయిన సంయుక్త పార్లమెంటరీ ప్యానల్ ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన తుది ముసాయిదాపై కసరత్తు మొదలైందని, ఈ తతంగం పూర్తయిన తర్వాత ప్రధాన మంత్రి పరిశీలనకు జీతాలు పెంపు నివేదికను పంపుతామని అధికార వర్గాలు తెలిపాయి.