నన్నూ చంపడానికి నయామ్ గ్యాంగ్ యత్నం
Published Wednesday, 31 August 2016సరూర్నగర్, ఆగస్టు 30: సరూర్నగర్ మండలంలోని బాలాపూర్లో నిర్వహిస్తున్న వందలకోట్ల విలువ చేసే ‘ప్రైడ్ ఇండియా’ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్యాంగ్స్టర్ నరుూమ్ బినామీ అని ఈ వ్యవహరంపై వెంటనే సిబిసిఐడిచే విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర నాయకుడు ఎ.శంకర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బడంగ్పేట్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాపూర్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు, శిఖం భూములు, దేవాలయాలు, మసీదులకు సంబంధించిన భూములను కబ్జాలు చేసి రియల్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రైడ్ ఇండియా సంస్థపై ఆయన ఆరోపణ చేశారు.